Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
మండలంలోని వైదోనివంపు గ్రామంలో శనివారం పూడ్చిన శిశువు మృతదేహాన్ని బయటకు తీసి ఫోరెనిక్స్ ల్యాబ్ బృందం సభ్యులు పోస్టుమార్టం నిర్వహించారు.ఈ నెల 16న మండలంలోని వైదోనివంపు గ్రామానికి చెందిన నల్లగాసు అనితను ఆమె భర్త లింగమయ్య దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు.ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్వవహరి ంచడంతో కాన్పుతో ఇబ్బంది పడుతుండగా ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా గర్భంలోని శిశువు మృతి చెందింది. దీనిపై ఆందోళన చేసిన బాధిత కుటుంబీకులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్, సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గైనకాలాజిస్టు శశికళ, నర్సు సుభాషిణి, ఆయా అబేదాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ఫోరెనిక్స్ ల్యాబ్ బృందం సభ్యులు వైదోనివంపు గ్రామంలో పూడ్చిపెట్టిన శిశువును బయటకు తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ జె. వెంకటేశ్వర్లు తెలిపారు.