Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండలంలోని శ్రీనివాసనగర్కు అన్యాయం జరగకుండా చూడాలని ఆ గ్రామ సర్పంచ్ బోగవిల్లి వెంకటరమణచౌదరి, మాజీ సర్పంచ్ చిలుకూరి సత్యనారాయణ కోరారు. శనివారం ఆర్డీఓ జగన్నాథరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీల పునర్వి భజనలో భాగంగా శ్రీనివాసనగర్ నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేశారన్నారు. విభజన క్రమంలో గ్రామ పంచాయతీకి తీరని అన్యాయం చేశారన్నారు.గ్రామపంచాయతీ పరిధిలో 400 కుటుంబాలున్నాయని, 65 సర్వే నెంబర్లు మాత్రమే కేటాయించారన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 331 సర్వే నెంబర్ల వరకూ తుంగపాడు-2 క్లస్టర్కు కేటాయించారని, అట్టి రికార్డులను ఆధారంగా చేసుకొని తుంగపాడు బంధం అవతల, ఇవతల శ్రీనివాసనగర్ గ్రామానికి సర్వే నెంబర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 18, 19, 20, 190, 205, 206, 207, 208, 209, 210లను తుంగపాడు గ్రామానికి కేటాయించారని, అందువల్ల తుంగపాడు బంధం ఇవతల ఉన్న ముఖ్యమైన భూములు, గోడౌన్స్, వేణుగోపాలస్వామి దేవాలయం తుంగపాడు సరిహద్దుగా నిర్ణయించారన్నారు.దీని వల్ల శ్రీనివాసనగర్ గ్రామానికి తీరని అన్యాయం వాటిల్లిందన్నారు. బంధాన్ని విభజరేఖగా నిర్ణయించి సరిహద్దులు నిర్ణయించాలని కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఎంపీటీసీ గోవిందు, గ్రామస్తులు అచ్యుతరామయ్య, మోహన్రెడ్డి, కృష్ణ, శ్రీను, లకిëనారాయణ ఉన్నారు.