Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి(సాగర్)
దళితుడిపై దాడి చేసిన దుంగలను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కనకరాజు సామేలు, లింగాల పెద్దులు కోరారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.శుక్రవారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో అల్వాల ఎక్స్ రోడ్డు నుంచి బయల్దేరి అల్వాల గ్రామానికొస్తున్న పగిడిమర్రి రవి అనే దళిత సామాజికవర్గానికి చెందిన యువకున్ని అదే గ్రామానికి చెందిన కొంతమంది దుండగులు మార్గమధ్యలో ఆపి కర్రతో, ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టి గాయపర్చారన్నారు.దాడి చేసిన నల్లబోతు సాయికుమార్, నల్లబోతు మల్లేష్, నల్లబోతు దశరథ, నల్లబోతు రవి, మహేష్, భూపాల్, సాగర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు ఇరిగి రామయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, పగిడిమర్రి రవికుమార్, స్వామి, ఆదిమళ్ల శ్రీను, నాగరాజు, దోరేపల్లి రవి, మల్లేశ్, రవి, మద్దిమడుగు నాగరాజు, మహేందర్, దుర్గయ్య పాల్గొన్నారు.