Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండల కేంద్రంలోని చలకుర్తి గిరిజన బాలుర వసతిగృహం కూలిపోయే స్థితికి చేరుకుందని తెలంగాణ గిరిజన సంఘం మండలాధ్యక్షులు రమావత్ బాలునాయక్ అన్నారు. గురువారం ఆయన వసతిగృహాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతుందన్నారు. భవనం పెచ్చులు పడుతున్నాయని, గట్టిగా వర్షమొస్తే కూలిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో మరుగుదొడ్లు, స్నానపు గదుల్లేక విద్యార్థులు బహిర్భూమికి వాగుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ కనెక్షన్లు కూడా అస్తవ్యస్తంగా ఉందని, నైట్ వాచ్మెన్ లేక రాత్రి వేళల్లో విద్యార్థులు భయాందోళనకు గురవుతు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయ కులు శ్రీరాములు, గోపాల్, క్రాంతి, నాగేంద్ర బాబు, బాలకృష్ణ, ముని, కొండలు పాల్గొన్నారు.