Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
మండలంలోని చెల్మడ గ్రామంలో బుధవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గాదెపాక వెంకటేశం కుటుంబానికి అండగా ఉంటానని జెడ్పటీసీ నారబోయిన స్వరూపరాణి రవి అన్నారు. గురువారం ఆయన అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. బరువు బాధ్యతలు మోసే కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమన్నారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జంగిలి నాగరాజు, చల్మడ గ్రామశాఖ అధ్యక్షులు పగిళ్ల శ్రీరాములు, మాజీ ఉపసర్పంచ్ పగిళ్ల సతీష్, కొంక రాజయ్య, గాదెపాక యాదయ్య పాల్గొన్నారు.