Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ పైలాన్కాలనీలోని నూతన బ్రిడ్జి ప్రమాదకరంగా మారుతోంది. 2005లో నాగార్జునసాగర్ డ్యామ్పై తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర వాహన రాకపోకలకు అనువుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జికి రక్షణ గోడ సరైన ఎత్తు లేకపోవడం, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడం, దానికి తోడు మూలమలుపు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సాగర్ అందాలు చూడటానికి ఇరు రాష్ట్రాల పర్యాటకులు, విదేశీ పర్యాటకులు ఇక్కడికి ప్రతి రోజూ వస్తుంటారు. డ్యామ్ అందాలను దిగువన ఉన్న నూతన వంతెనపై నుంచి తిలకిస్తుంటారు. శని, ఆదివారాల్లో పర్యాటకులతో బ్రిడ్జి కిటకిటలాడుతోంది. వంతెనకు సరైన రక్షణ గోడ లేక బ్రిడ్జిపై నుంచి జారి పడి గతంలో హిల్కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ జారి పడి మృత్యువాతపడ్డారు.
ఆత్మహత్యకు అడ్డాగా..
ఆత్మహత్య చేసుకోవడానికి కొత్త బ్రిడ్జి అడ్డాగా మారుతోంది. బ్రిడ్జి నిర్మించినప్పటి నుంచి ఎనిమిది మంది వరకూ దానిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నూతన బ్రిడ్జి దాదాపు వంద అడుగుల ఎత్తు ఉంటోంది. గతంలో పులిచర్లకు చెందిన కొండయ్య బ్రిడ్జిపై నుంచి దూకడంతో రాళ్లపై పడిపోయాడు. మత్స్యకారుల సమాచారంతో పోలీసులు ఆయన్ను రక్షించారు.
రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలి : సాయి, పైలాన్కాలనీ
బ్రిడ్జిపై రక్షణ గోడ ఎత్తు తక్కువ ఉండటంతో ప్రమాదాలు జరుగుతు న్నాయి. వెంటనే గోడ ఏర్పాటు చేయాలి. కొత్త వంతెనపై విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి.