Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని ఏపీ లింగోటం ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి పాలడుగు సరోజిని దేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం అవుతాయని సూచించారు. ఉపాధ్యాయుల పనితీరుపై పాఠశాలలు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గాయం నర్సింహరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.