Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
అటవీ సాగు భూముల నుంచి గిరిజన రైతుల గెంటివేతలను ఆపాలని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ గిరిజన సంఘం జల్లా కార్యదర్శులు కూన్రెడ్డి నాగిరెడ్డి, కొర్ర శంకర్నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సుందరయ్య భవన్లో కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. గిరిజనులు, ఇతర సాంప్రదాయక అటవీ నివాసులు 13.12.2005కు పూర్వం సాగు చేసుకుంటున్న పదెకరాల అటవీ భూమికి హక్కుపత్రాలివ్వాలన్నారు. గతంలో చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించడం సరికాదన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం నిర్దేశించిన పద్ధతి పూర్తి కాకుండా అటవీ భూముల నుంచి సాగుదార్లను తొలగించొద్దన్నారు. గిరిజన రైతులకు హక్కు పత్రాలివ్వాలని కోరుతూ ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాల్లో గిరిజన రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, గిరిజన సంఘం నాయకులు పోల వెంకటేశ్వర్లు, సీతారాంరెడ్డి, ఆంగోతు రెడ్యానాయక్, కొర్ర అశోక్నాయక్, కొర్ర మోతీలాల్నాయక్ పాల్గొన్నారు.