Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి(సాగర్)
స్థానిక గ్రామపంచాయతీ పక్కన ఉన్న స్థలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ప్లాంటు నిర్మాణానికి సర్పంచ్ శాగం శ్రవణ్కుమార్రెడ్డి, రైతుసమన్వయసమితి మండల కోఆర్డినేటర్ శాగం రాఘవరెడ్డి, ఉపసర్పంచ్ వల్లవాయి అంజయ్య గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పుట్లూరి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నిధులతో వాటర్ప్లాంటు ఏర్పాటు చేయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్కె.రహీం, వార్డు సభ్యులు మల్లయ్య, రాంబాబు, గ్రామ పెద్దలు శాగం అంజిరెడ్డి, బత్తుల నారాయణ, పసుపులేటి కృష్ణ, కళమ్మ, నాగరాజు, లక్ష్మయ్య, నాగిరెడ్డి, సైదయ్య, సైదులు పాల్గొన్నారు.