Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజలు కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆర్డీఓ కెఎంవి. జగన్నాధరావు అన్నారు. ఆదివారం మండలంలోని బోటగానితండాను సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధి పనులు పరిశీలిం చారు.ప్రభుత్వ భూములను చూశారు. పార్టీలకతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, నిధులు, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అర్హులైన పేదలందరికీ పథకాలందేలా చూడాలన్నారు. సర్వే నెంబర్ 282, 391లో ప్రభుత్వ భూమి ఉందని, వాటిని ఆక్రమించుకుంటే చర్యలు తీసుకుం టామన్నారు. అట్టి భూమిని గ్రామపంచాయతీ ప్రభుత్వ భవనాల కోసం కేటాయించేందుకు చర్యలు తీసుకుం టానన్నారు. యువకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని సంఘాల సభ్యులు సమన్వయంతో ఉండి గ్రామంలో పరిశుభ్రతను పాటించాలన్నారు. శ్రమదానం, హరితహారం చేపట్టి అభివృద్ధిపర్చు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దవూర :మండలంలోని తుంగతుర్తి గ్రామంలో సర్పంచ్ మెండె విష్ణుప్రియ సైదులు ఆదివారం రహదారులకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు, గ్రామంలోని ఇండ్ల మధ్యనున్న దిబ్బలను తొలగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు చేపడుతున్నారు. ప్రతిరోజూ చేయాల్సిన పనులను చేస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములౌతున్నారు.
చందంపేట :గ్రామాభివృద్ధే లక్ష్యమని ముడుదండ్ల సర్పంచ్ లోకసాని అనురాధ నారాయణరెడ్డి అన్నారు.మండలంలోని ముడుదండ్ల గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా రోడ్డుకిరువైపులానున్న పిచ్చిమొక్కలు తొలగించి పాతబావులు పూడ్చివేశారు. శిథిలమైన కరెంటు స్తంభాలు తొలగించారు.అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో పల్లెలు కొత్త రూపు సంతరించు కుంటున్నా యన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్):గ్రామస్తులు సహకార ంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జెడ్పీటీసీ సూర్యాభాషానాయక్ అన్నారు. మండల ంలోని జాల్తండాలో జరుగుతున్న ప్రణాళిక పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామినాయక్, రమేశ్నాయక్, శ్రీనివాస్రెడ్డి, జవహార్నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
దామరచర్ల : మండలంలోని గణేష్పహాడ్ గ్రామంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి సైదులునాయక్,ఉపసర్పంచ్ కృష్ణ, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మీ, నోడల్ అధికారి పి.శ్రీనివాస్, కార్యదర్శి మధు పాల్గొన్నారు.
మర్రిగూడ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక పనులు నిర్వహించేందుకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సెలవు రోజైనప్పటికీ సంబంధిత గ్రామాల్లో విధులు నిర్వహించి పనులు చేయిం చారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కల్లు స్వాతి నవీన్రెడ్డి, మాదగోని శేఖర్గౌడ్, మాడెం శాంతమ్మ వెంకటయ్య, కార్యదర్శులు పద్మ, రాధ, శ్రీశైలం పాల్గొన్నారు.
వేములపల్లి :30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని సల్కునూరు గ్రామంలోని శిథిలావస్థలోనున్న పాఠశాల భవనాన్ని కూల్చి వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంకెపాక రాజు మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన మూడు గదులను కూల్చివేయడం జరిగిందని, అదనంగా తరగతి గదులు ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదాల నివారణ కోసం ముందస్తుగా శిథిలమైన భవనాలు కూల్చివేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకా ధికారి వీరయ్య, ఉపసర్పంచ్ గడ్డం శ్రీను, ఎంపీటీసీ గడ్డం రాములమ్మ వెంకన్న, లకిë, ప్రధానో పాధ్యాయులు ఎల్లయ్య, ఎస్ఎంసీ చైర్మన్ కరుణాకర్ పాల్గొన్నారు.
చింతపల్లి:మండలంలోని కురుమేడు, చింత పల్లి, చాకలిశేరిపల్లి, తక్కెల్లపల్లి, తీదేడు గ్రామాల్లో రోడ్డుకిరువైపులా ఉన్న కంపచెట్లు తొలగించి పాత ఇండ్లను జేసీబీతో తొలగించారు. కురుమేడు ప్రత్యేకాధికారి సమీర్ మాట్లాడుతూ కురుమేడులో చేపడుతున్న కంపచెట్ల తొలగింపు త్వరితగతిన పూర్తి చేసి పాత గోడలు జేసీబీతో కూల్చామన్నారు.30 రోజుల ప్రణాళిక అంటే గ్రామాల రూపురేఖలు మార్చడమేనన్నారు. ఆయన వెంట జైహింద్, మహేశ్ పాల్గొన్నారు.