Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లమల అడవులను కాపాడుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు రెమడాల పరుశురాములు అన్నారు.ఆదివారం స్థానికంగా ఆ సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని నల్లమల అడవులను నాశనం చేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతు న్నారన్నారు.యురేనియం తవ్వకాలు చేసి మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. యురేనియం తవ్వకాల వల్ల జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్నారు.అన్ని వర్గాల ప్రజలు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో చేపట్టిన తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దైద జనార్థన్, ఆదిమళ్ల సైదులు, బ్రహ్మచారి, బాలయ్య, మల్లయ్య, పుల్లయ్య పాల్గొన్నారు.