Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రిగూడ :మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పక్కనున్న శ్మశాన వాటికను అధికారులు ఏ సర్వే నెంబర్లోనైనా ఏర్పాటు చేసినా..తమకు అభ్యంతరం లేదని మర్రిగూడ సర్పంచ్ నల్లా యాదయ్య అన్నారు. ఆదివారం ఆయన స్థానికంగా విలేకర్లతో మాట్లాడారు.రెవెన్యూ అధికారులు 127 సర్వే నెంబర్లో శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపినప్పటికీ గ్రామానికి సమీపం అవుతుందని అభ్యంతరం తెలిపామన్నారు.రెవెన్యూ సిబ్బంది 127, 140, 158 నెంబర్లలో ఎక్కడ ఏర్పాటు చేసినా..తమకు అభ్యంతరం లేదని, కావాలనే కొంతమంది రాజకీయంగా తమపై బురద జల్లే ప్రయత్నం సరికాదన్నారు.