Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మలిదశ ఉద్యమంలో ప్రాణాలు వదిలి రాష్ట్రసాధనలో కీలకంగా మారిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను సీఎం కేసీఆర్ మరిచారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆరోపించారు. ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్కు బహిరంగలేఖ రాశారు.హుజూర్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో శంకరమ్మను విస్మరించి ఎన్నారై సైదిరెడ్డికి టికెట్ అవమానపర్చారన్నారు. ఉప ఎన్నికల్లో సైతం శంకరమ్మకు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో నిజమైన ఉద్యమకారులకు స్థానం లేకుండా పోయిందన్నారు. 52 శాతం ఉన్న బీసీల పట్ల కేసీఆర్ సవతితల్లి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు.ఆంధ్రా సెటిలర్లు, డబ్బున్న వారికి టికెట్లు ఇచ్చి కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మారుతున్నాడన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో శంకరమ్మకు టికెట్ ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, బెజ్జం జానయ్య, రాంబాబు, సైదులు, సత్యం, రఘు, కార్తీక్, సంజీవ్, సాయి, మల్లి పాల్గొన్నారు.