Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
2020 ఏప్రిల్ నుంచి నిర్వహించే జనగణన విధులకు ఎన్యుమారేటర్స్ను సీనియార్టీ కలిగిన ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నాగరాజుకి టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళ వారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సం ఘం జిల్లా కార్యదర్శి నన్నేబోయిన సోమయ్య మాట్లా డుతూ అనుభవం కలిగిన సీనియర్ ఉపాధ్యాయులు జనగణన చేపడితే ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఉంటాయన్నారు. సీనియారిటీ ప్రాతిపదికగా నియమ నిబంధనలను అనుసరించి నియమించాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీను, అధ్యక్షులు రాజన్న, నాయకులు క్రాంతి ప్రభ పాల్గొన్నారు.