Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నవతెలంగాణ-క్లాక్టవర్
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, రెవెన్యూ భూ సమస్యల పట్ల నిశిత పరిశీలన జరిపి రెండు వారాలలోగా ఎలాంటి పెండింగ్స్ లేకుడా వంద శాతం పరిష్కారం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తహసీల్దార్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో మండలాల వారిగా రెవెన్యూ సమస్యలు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రజావాణి ద్వారా వచ్చిన రెవెన్యూ సమస్యలు, గ్రామాలపై ఎక్కువ ఫోకస్ కనబర్చాలని, వందశాతం పరిష్కారం చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో గ్రామాల పర్యటన చేయాలని, తద్వారా పలు సమస్యలు అక్కడే పరిష్కారమ వుతాయని,గ్రామాల సమస్యల పట్ల అవగాహన కలుగుతు ందని తెలిపారు. ధరణి వెబ్సైట్లో పెండింగ్ లేకుండా చూడాలని, డిజిటల్ సంతకాలు వెంటనే పూర్తిచే యడం, మ్యుటేషన్స్ నాన్ డి.ఎస్. ఖాతాలు, సీసీఎల్ఏ నుంచి వచ్చిన కేసులు, తదితర పనులు వెంటనే పూర్తి చేసుకోవాలని తెలిపారు. పరిష్కరించలేని సమస్య లకు సంబంధించి ఫిర్యాదులకు పిరిస్థితిని అర్ధమయ్యేలా విడమరచి చెప్పాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్వహిస్తున్న వైకుంఠదామం, డంపింగ్ యార్డుల స్థలాలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజనల్ అధికారులు జగదీశ్వరరెడ్డి, లింగ్యానాయక్, రోహిత్సింగ్, అన్ని మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.