Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రతి రైతు వానకాలం పంటల సాగు వివరాలను అంతర్జాలంలో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి మనోహర్ అన్నారు.మంగళ వారం మండలపరిధిలోని గానుగుబండ గ్రామంలో రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21 తేదీలోపు రైతులు పంటల సాగు నమోదు సర్వే నెంబర్ వారిగా పంటల వారీగా విధిగా నమోదు చేసుకోవాలన్నారు. దీనివల్ల రైతులు పండించిన పంటను ఐకేపీ ద్వారా లేదా పీఏసీఎస్ ద్వారా గాని పత్తి సీసీఐ ద్వారా గాని పప్పు దినుసులు, మార్క్ఫెడ్ ద్వారా రైతులు పంటలను విక్రయించడం సులభతరం అవుతుందన్నారు.వ్యవసాయ శాఖ ద్వారా అంతర్జాల నమోదు వివరాల ఆధారంగా కొనుగోలు జరుగుతుందన్నారు.రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లు రాంచంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ గుండగాని శ్రీహరి, వీరన్న, రైతులు పాల్గొన్నారు.
మద్దిరాల: రైతులు తాము వేసుకున్న పంట వివరాలను నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు జగ్గునాయక్ కోరారు.మండలంలోని కుంటపల్లి గ్రామంలో రైతులతో ఆయన మాట్లాడారు.రైతులు ఏఏ పంట సాగు చేసుకున్నారనే వివరాలు ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలన్నారు.ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు పడని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఓ దివ్య, ఏఈఓ అనూషా, రైతులు పాల్గొన్నారు.
మోతె: రైతులు ఖరీఫ్లో సాగు చేసిన పంట వివరాలు ఆయా వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారిణి అరుణ కోరారు.మండల పరిధిలోని మామిళ్లగూడెం, సిరికొండ గ్రామాల్లో రైతుల పంటల సాగు వివరాలను సేకరిం చారు.ఈ కార్యక్రమంలో ఏఈఓలు కార్తీక్, ఉషా, రైతులు పాల్గొన్నారు.
కోదాడరూరల్: మండలంలోని తొగర్రాయి, నల్లబండగూడెం గ్రామాల్లో రైతుపొలాల్లో కల్లాల నిర్మాణం, రైతులు సాగు చేసే పంటల వివరాలను మండల వ్యవసాయ అధికారిణి రజిని పరిశీలించారు.ఈ కార్యక్రమ ంలో సర్పంచ్ దొంగల లక్ష్మీనారా యణ, మట్టపల్లిరావు, ఏఈవో సల్మా, రైతులు పాల్గొన్నారు.
అర్వపల్లి:రైతుల పంట సాగు వివరాలను వ్యవసాయ కార్యాలయంలో తప్పకుండా నమోదు చేసుకోవాలని తుంగతుర్తి ఏడీఏ జగ్గునాయక్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో పంటల సాగు కాస్తు నమోదును పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వానకాలంలో రైతులు తమ భూముల్లో నేల సాగును బట్టి పంటలను సాగు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఓ దినాకర్, ఏఈఓలు శోభారాణి, సత్యం,సర్పంచ్ దానం సుజాత, రైతు బంధు కోఆర్డినేటర్లు లక్ష్మీనర్సు, విజరు పాల్గొన్నారు.