Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ముంబయిలోని అంబేద్కర్ నివాసం రాజగృహంపై దాడి చేసిన దుండుగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని దళిత్ శక్తి ప్రోగ్రాం నాయకులు బి.రాజశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగృహంపై దాడి దళిత సమాజానికే కాకుండా యావత్ దేశానికే అవమానకరమన్నారు. ఈ దుశ్చర్యను దేశద్రోహం కింద పరిగణించి దాడికి పాల్పడిన దుండుగలతో పాటు, వారి వెనక ఉన్న వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు టి.ఎల్లయ్య, ఎస్.శంకర్, వంశీ, రాజు, సంజు పాల్గొన్నారు.
మర్రిగూడ: డా.బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేయడం అప్రజాస్వామికమని లెంకలపల్లి ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జిల్లా తిరుమలేష్ అన్నారు. నిరసనలో భాగంగా సురంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి దిక్సూచి అయిన రాజ్యాంగ నిర్మాత ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య పేర్కొన్నారు. వెంటనే దుండగులను గుర్తించి దేశద్రోహం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్యార శ్రీనివాస్, వెంకటేశ్ ,జిల్లా జంగయ్య, ఏర్పుల వెంకటయ్య, మేకల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు