Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.. కందేపి రాణీప్రసాద్.
పింకీ చాలా చలాకీ గల పిల్ల. రోజు బడికి చక్కగా వెళుతుంది. ఏ రోజు బడికి పోనని పేచి పెట్టదు. అమ్మానాన్నల గారాబాల కూతురు. అమ్మ చెప్పినట్లు వింటుంది పింకీ. అమ్మ లేపగానే నిద్ర లేస్తుంది. స్నానం చేయించి బట్టలు తోడగగానే బడికి తయారవుతుంది. అమ్మ పాలు తాగింది బ్యాగ్ తాగించి బ్యాగ్ తగిలించి ఆటో ఎక్కిస్తుంది. ఇది దినచర్య.
కానీ గత కొన్ని నెలలుగా పింకి హుషారుగా ఉండట్లేదు. అందరితో కలిసి ఆడుకోవడం లేదు. మైదానంలో పిల్లలంతా ఉత్సాహంగా ఆటలు ఆడుకుంటుంటే పింకి మాత్రం క్లాస్ రూంలో డెస్క్ మీద తల పెట్టుకొని నిద్రపోతున్నది. బాధగా మొహం పెడుతున్నది. ఏ విషయాన్నీ మిగతా పిల్లలు, టీచర్లు గమనించారు. పింకి అమ్మానాన్నల్ని పిలిపించి చెప్పారు.
అవును వాళ్ళు కూడా ఏ విషయాన్నీ గమనించారు. ఎప్పుడు స్తబ్దుగా ఉంటోంది. చలాకీతనం తగ్గింది. పొట్ట పట్టుకుని కూర్చుంటోంది. బహుశ పొట్టలో నొప్పి వస్తుందేమో అనుకున్నారు. వెంటనే డాక్టరుకు చూపించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ మరునాడే పింకీని పిల్లల డాక్టరు ప్రసాద రావు వద్దకు తీసుకు వెళ్లారు. వారి పేరు వచ్చేదాకా నిరీక్షించారు.
పింకీని చూపించి విషయమంత వివరించారు అమ్మానాన్న డాక్టరు గారు పరీక్షించి ని ఆకలి మాములుగానే ఉన్నదాు అని అడిగాడు. నిలేదు డాక్టరు గారు, ఈ మధ్య ఏమి తినటం లేదుు అన్నారు. ాసరే అని డాక్టరు గారు తల ఎత్తి అమ్మానాన్నలతో ఇలా చెప్పారు.
నిచుడండి, పాపకు పొట్టలో పురుగులు చేరాయి. సాధారణంగా నులి పురుగులు చేరతాయి. వీటి వలన కడుపులో నొప్పి, ఆకలి మందగించడం, నిరసనగా ఉండడం, ఉత్సాహం లోపించడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. పిల్లలు మట్టిలో ఆడుకోవడం వలన మట్టిలో ఉండే నులి పురుగులు గుడ్లు చేతుల ద్వార పిల్లల నోట్లోకి చేరతాయి. అవి అల పొట్టలోకి చేరి జీర్ణాశయంలో నివాసం ఏర్పరచుకొని పెరిగి పెద్దవై పిల్లల్ని పెట్టుకుంటూ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. వీటి వలననే పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది. అందుకే పిల్లలకు ఆహారం తినే ముందు చేతుల్ని బాగా సబ్బుతో కడగాలి. అదే విధంగా టాయిలెట్ కు వెళ్లి వచ్చాక కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పించాలి. అలాగే శుభ్ర పరిచిన మంచి నీరునే తాగాలి. ఏ జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు వీటి బారి నుండి రక్షింప బడతారుు. అని చెప్పాడు డాక్టరు.
వెంటనే అమ్మానాన్న ని ఇప్పుడెల డాక్టరు గారు ని అన్నారు ఆదుర్దాగా.
నిఅమ్మ! మీరేం భయపడాల్సిన అవసరం లేదు. దీనికి నేను ఒక మందు ఇస్తాను. దాన్ని ఏ రాత్రికి రెండు మూతలు తాగించండి సరిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు పూర్తిగా తగ్గిపోతుంది. కానీ పిల్లలు పరిశుభ్రంగా పనులు చేసుకునేలా తర్ఫీదు ఇవ్వాలి. పిల్లల గోళ్ళు ఎప్పటికప్పుడు కత్తిరించాలి. చేతులు కడిగినప్పటికి గోళ్ళలో మలినాలు ఇరుక్కుంటాయి. ఏ జాగ్రత్తలు పటిస్తే చాలుు వెళ్ళిరండి అన్నాడు డాక్టరు.
ని నమస్కారం డాక్టరు గారు, చాల విషయాలు తెలియజెప్పారు. ఇక నుంచి చాల జాగ్రత్తగా ఉంటాం మీరు చెప్పిన వన్ని పాటిస్తాం అంటూ వెళ్ళిపోయారు.
ఇంటికి వెళ్ళి రాత్రికి మందును తాగించారు. తర్వాతి రోజు పింకి కడుపు నొప్పి అనలేదు. నాలుగు రోజుల తర్వాత నిఅమ్మ నాకు ఆకలేస్తుందిు అంటూ అన్నం పెట్టమని అడిగింది. ఇంకా నాలుగు రోజులు పోయాక పూర్వం లాగా తోటి పిల్లలతో లేడిలా ఆడటం మొదలు పెట్టింది. ఎప్పుడు స్తబ్దుగా ఉండడం లేదు. లేడి పిల్లలా గెంతుతునే ఉన్నది. పూర్తి ఆరోగ్యంగా సాధారణ స్థితికి వచ్చింది. పింకినిలా చుసిన అమ్మానాన్నలు చాల సంతోషపడ్డారు. తాము తెలుసుకున్న విషయాలను ఇరుపు పొరుగుకు చెప్పి వారిని చైతన్య పరిచారు. పింకి మళ్ళి ఎప్పుడూ జబ్బు పడలేదు. ఆనందంగా గెంతుతూ ఉత్సాహంగా ఉంది.