Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆసిఫాబాద్
గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఆదివారం గోలేటి ప్రధాన రహదారిపై బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని హెచ్చరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కార్మికులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గతంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి భోగే ఉపేందర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, జేఏసీ నాయకులు అశోక్, తిరుపతి, సాగర్ గౌడ్, పోశం, చిన్నుబాయ్, తిరుమల, శ్రీనివాస్, సోమయ్య, పద్మ, రాధ, శంకరమ్మ పాల్గొన్నారు.