Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్
కుమురం భీం విగ్రహ ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి ఆర్థిక సాయాన్ని అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామంలో ఏర్పాటు చేయనున్న కుమురం భీం విగ్రహనికి ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కుమురం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా శైలిలో పోరాడిన వీరుడని కొనియాడారు. పశువుల కాపరులపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ తెలిపారు. ఈ విగ్రహ ఏర్పాటుకు విరాళం అందించడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పాకాల ఫౌండేషన్ చైర్మెన్ పాకాల రాంచందర్, సోన్ మండలం టీఆర్ఎస్ అధ్యక్షులు మొయినుద్దీన్, మాజీ సర్పంచ్లు లింగన్న, గంగాధర్, నాయకులు బీ.ప్రవీణ్, ఎం.చిన్నయ్య, ఎం.సాయన్న, సాయి, సీహెచ్. గంగాధర్ గ్రామస్తులు పాల్గొన్నారు.