Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ (ఎఫ్బీఓ) ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణనిస్తున్నామని జిల్లా గిరిజన శాఖ అధికారి డి.జనార్ధన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉట్నూర్ కెబి.కాంప్లెక్స్ కేంద్రంగా నిర్వహించే నెలరోజుల శిక్షణ కేంద్రంలో 100 మంది అభ్యర్థులకు గానూ ఎస్టీలు 75శాతం, ఎస్సీలకు 15శాతం, బీసీలకు 10శాతం, మహిళలకు 33,1బై3 శాతం, వికలాంగులకు 3 శాతం సీట్లను కేటాయించామని అన్నారు. ఇంటర్మీడియట్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసే ప్రక్రియలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 6న దరఖాస్తులకు చివరి తేదీ అని, 10న ఎంపిక జాబితా, 20న ధ్రువపత్రాల పరిశీలన, 21న తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.