Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్రూరల్
అవినీతి ఉన్నతాధికారులు దేవి శ్రీకాంత్ను మానసికంగా వేధింపులకు గురిచేయడంతోనే ఒత్తిడికి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. శ్రీకాంత్ ఆత్మహత్యకు కారకుడైన పంచాయతీరాజ్ ఈఈ రఘువీరారెడ్డిని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. దేవి శ్రీకాంత్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో గజిటెడ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, మోహన్, పెన్షనర్ల అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్రెడ్డి, ఎంసి.లింగన్న, టీఎన్జీఓ అధ్యక్షులు ప్రభాకర్, బషీరోద్దీన్, ఏఈఓల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్, రవికుమార్, మోచీ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, దళిత సంఘాల నాయకులు సిద్ద ముత్యం, పడిగెల రాజేశ్వర్, బొడ్డు లక్ష్మణ్, బీఎస్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, వెంకటస్వామి, ఎస్సీ, ఎస్టీ ప్రోటక్షన్ జిల్లా అధ్యక్షులు డి.రాములు, సామేల రాజన్న, విజరుకుమార్, డొగ్రే, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణకుమార్ పాల్గొన్నారు.