Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తానూర్
సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.39 వేల చెక్కును ఎంఎల్ఏ విఠల్రెడ్డి బాధిత కుటుంబానికి బుధవారం అందజేశారు. మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన సింగిరెడ్డి రాజారెడ్డి అనారోగ్యంతో బాధపడడంతో ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ఈ చెక్కును అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల కన్వీనర్ పోతారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు భోజన్న, టీఆర్ఎస్ నాయకులు నగేష్ పటేల్ ఉన్నారు.