Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉట్నూర్ టౌన్
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్కారాంలోని నాయక్ పోడ్ సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహానికి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయక్పోడ్ సేవాసంఘం గతంలో పలు సమస్యలు దృష్టికి తీసుకువచ్చిందని, వాటి పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు. అనంతరం నాయక్పోడ్ సేవా సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు భూమన్న, మాజీ సర్పంచ్ లక్ష్మి,నాయకులు గంగన్న, లింగాగౌడ్, రాజేశ్వర్, ధర్మరాజు, మల్లయ్య, రవి, నారాయణ పాల్గొన్నారు.