Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోథ్
వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు అజీజ్ ఖాన్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేవిధంగా చూడాలన్నారు. టీఏ, డీఏతోపాటు వారసత్వ ఉద్యోగాలకు జీఓ జారీ చేయాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ప్రేమ్సాగర్, సహాయ కార్యదర్శి కలీం, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ, మండలాధ్యక్షులు హైదర్ పాల్గొన్నారు.