Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19తో ప్రపంచంతో పాటు దేశంలోని ప్రతీరంగమూ తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఎప్పటికి కోలుకుంటాయో తెలియని పరిస్థితి. లాక్డౌన్ నుంచి అన్లాక్కు వచ్చినా పరిస్థితి మారలేదు. ఇంకా ఆందోళన పెరిగింది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతున్నది తప్ప తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రజల్లో భయాందోళనలు అలాగే ఉన్నాయి. వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందన్న వార్తలతో జనం ఒక ఆశావహదృక్పథంతో ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చినా రాకున్నా ప్రజల్లో ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ఈ సమయంలో దేశ, సమాజ, భవిష్యత్ అభివృద్ధి అవసరాల దృష్ట్యా ఎంతో విలువైన మానవ వనరులను అభివద్ధి చేసే కార్యక్రమాలుగా విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతో ఉంది. విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. లాభనష్టాల దృష్టితో కాకుండా దీర్ఘకాలిక అభివద్ధిగా భావించి వైద్య, విద్యారంగాలను అత్యవసర సర్వీసుగా భావించి ప్రభుత్వరంగంలోని కళాశాలలకు నిధులు కేటాయించి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. కోవిడ్-19కు సంబంధించి, డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎమ్ఆర్, జారీ చేసే సూచనలను కచ్చితంగా పాటిస్తూ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలి. తక్షణం విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేందుకు కాంట్రాక్ట్ లెక్చరర్స్ను, యంటీఎస్. మొదలైన వారిని వెంటనే రెన్యువల్ చేయాలి. కళాశాలల మనుగడకు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్రమబద్దీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. 2019-20 విద్యాసంవత్సరంలో చదివిన పదవతరగతి విద్యార్థులందరూ పాస్ అయ్యారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే అవకాశం ఉన్నది. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో కలిసి సుమారు 3లక్షల మంది విద్యార్థులకు అనుగుణంగా కళాశాలల్లో తరగతి గదులు ఏర్పాటు చేయాలి. గత సంవత్సరం సుమారు 2లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అందుకు అనుగుణంగా చాలా కళాశాలల్లో అవసరం కన్న పెద్దగా ఉన్న తరగతి గదులను కార్డ్బోర్డ్తో విభజించి తాత్కాలికంగా భౌతిక దూరం పాటించడానికి వీలుగా ఉపయోగించుకోవాలి. కోవిడ్-19 ప్రభావాన్ని అంచనా వేసి ఈ విద్యా సంవత్సరంలో కళాశాలల కొనసాగింపుకు 2 లేదా 3 యాక్షన్ ప్లాన్స్ తయారు చేసి వాటికి అనుగుణంగా, అధ్యాపకులను, విద్యార్థులను సిద్ధం చేయాలి.
క్లాసెస్ ఎలా ఉండాలి
1వ సూచన :25శాతం ఆన్లైన్ క్లాసెస్ - 75శాతం ఆఫ్లైన్ క్లాసెస్
2వ సూచన :50శాతం ఆన్లైన్ క్లాసెస్ - 50శాతం ఆఫ్లైన్క్లాసెస్
3వ సూచన :75శాతం ఆన్లైన్ క్లాసెస్ - 25శాతం ఆఫ్లైన్ క్లాసెస్
4వ సూచన :100శాతం ఆన్లైన్ క్లాసెస్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయాలి.
ఆన్లైన్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, టెస్టులకు అనుగుణంగా విద్యార్థులను ముందుగానే సిద్ధం చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. వాటి కోసం అధ్యాపకులను సిద్ధం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ బోధనకు అనుగుణంగా సిలబస్, పాఠ్యపుస్తకాలు తయారు చేయాలి. కళాశాలల్లో సబ్జెక్ట్ వారీగా, విద్యార్థులను వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర పద్ధతుల్లో గ్రూప్గా ఏర్పాటు చేసి విద్యార్థులకు సాంకేతికపరమైన సూచనలు ఇవ్వడానికి ప్రతికళాశాలల్లో కంప్యూటర్ నాలెడ్జ్కు సంబంధించిన ఒక మెంటార్ను నియమించాలి. దూరదర్శన్, టి-శాట్ వంటి ఛానల్ ద్వారా వీడియో పాఠాలు విద్యార్థులకు అందేటట్టు చూడాలి. కళాశాలను యూనిట్గా తీసుకొని ఆ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, తరగతి గదులను పరిగణలోకి తీసుకొని భౌతిక దూరం పాటిస్తూ, షిఫ్ట్ల వారీగా తరగతులు నిర్వహించాలి.
ప్రతి కళాశాలలో ప్రిన్సిపాల్ ఆఫీసు నుంచి అన్ని క్లాస్ రూమ్లకు, స్టాఫ్ రూమ్లకు పబ్లిక్ ఆడియో సిస్టమ్ (మెక్ సిసన్)ను ఏర్పాటు చేసి దీని నుంచి విద్యార్థులకు భాతికదూరం, ఇతర సూచనలు తెలియజేయాలి. అవసరమైతే అక్కడ నుంచే క్లాసు రూములలో విద్యార్థులను దూరంగా దూరంగా కూర్చోబెట్టి పాఠ్యాంశాలు వినిపించేలా చేయాలి. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలను నియమించాలి. శానిటైజర్ పరికరం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని ప్రతి కళాశాలల్ల తప్పనిసరిగా స్కావెంజర్స్, అటెండర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. కళాశాలల్లో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు మంచినీరు సౌకర్యం కల్పించాలి. ఇతర మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
గత విద్యా సంవత్సరంలో జూన్ నుంచి మార్చి వరకు మొత్తం కాలేజి వర్కింగ్ డేస్ 222రోజులుగా ఉన్నవి. ఈ విద్యా సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు నెలలు కలిపి ఇప్పటికి 70రోజులు వర్కింగ్ డేస్ కోల్పోయాం. వాటిని అధిగమించడానికి సెలవులు తగ్గితే సిలబస్ను పూర్తి చేయడానికి ఆస్కారం ఉంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, అధ్యాపకులు బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు చేయాలి. సిలబస్ విషయంలో సబ్జెక్టు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి జాతీయ పోటీ పరీక్షలకు, సబ్జెక్ట్ పై అవగాహన వుండేటట్టు సబ్జెక్ట్ వర్క్బుక్స్ తయారు చేసి ఇవ్వాలి. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ట్యాబ్ కాని, ఇతర సాంకేతిక పరికరాలను ప్రభుత్వమే అందచేయాలి. యూట్యూబ్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేసే అప్లికేషన్స్ ఉంటే బాగుంటుంది. విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి సైకిల్ లాంటి వాటిని ప్రభుత్వం కల్పించాలి. ఉపకారవేతనాలను చివర్లో కాకుండా ప్రతినెల చెల్లిస్తే బాగుంటుంది. చూడాలి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ మొదలైన కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది.
సెల్: 9989078474