Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వం వ్యవసాయం, మార్కెట్లను కూడా దేశ విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. వ్యవసాయం మీద 60శాతం మంది ఆధారపడినప్పటికీ 100శాతం ప్రజలపై ప్రభావం చూపుతుంది. అటువంటి వ్యవసాయంలో తీవ్రమైన సవరణలు చేస్తున్న మోడీ ప్రభుత్వం.. కనీసం పార్లమెంటులో చర్చించలేదు. రాష్ట్రాలతో మాట్లాడలేదు. ఏకపక్షంగా మూడు ఆదేశాలు జారీ చేసింది. కార్మిక చట్టాలపై వేటు వేసి కార్మికులను కార్పొరేట్లకు కాట్టుబానిసలుగా చేసే సవరణలు చేస్తున్నది.
కాంట్రాక్టు వ్యవసాయం ముప్పే
రైతులు, వ్యవసాయ కార్మికులు పంట పండిస్తున్నారు. వారు పండించింది రైలు, లారీ రవాణా కార్మికులు ప్రజల వద్దకు చేర్చుతున్నారు. ఎరువులు, పురుగు మందులు తయారు చేసే కార్మికులు, రైలు, లారీ, ట్రాక్టర్ ఉత్పత్తి చేసే కార్మికులు పంటకు పరోక్షంగా సహకరిస్తున్నారు. పంటను ఎత్తి దించి ప్రజల దగ్గరకు చేర్చడంలో ముఠా కార్మికులు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. నాగలి, నక్కు, బండి, తట్ట, బుట్ట తదితర పరికరాలు చేసిన వత్తిదారులు తమ వంతు తోడ్పడు తున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలురైతులు, కార్మికులు, వత్తిదారుల సమిష్టి కషి వలనే పంట పండించి ప్రధాని మొదలు దేశ ప్రజలందరికి తిండి పెడుతున్నారు. ఇపుడు మోడీ దేశవిదేశీ కార్పొరేట్ల పక్షాన నిలబడి కార్మికులు, కర్షకులు, వత్తిదారులు, సమస్త దేశ ప్రజలకు ముప్పు తెస్తున్నారు.
ఉత్పత్తి.. మార్కెట్... కంపెనీ పరం...
కాంట్రాక్టు వ్యవసాయం వలన... రైతు తన భూమిలో కష్టపడి పండించినా... పంటపై రైతుకు హక్కు ఉండదు. కార్పొరేట్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పండిన పంట అంతా కంపెనీకి ఇచ్చేయాలి. దీని వలన పంటంతా కార్పొరేట్లకు చేరిపోతుంది. మోడీ ఆర్డినెన్సు వలన రైతు దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చు. రైతు ఇంటి దగ్గర లేదా సమీప మార్కెట్ యార్డులో అమ్ముకోగలడు. ఇంకెక్కడ అమ్మగలడు? రైతుకు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ పేరుతో కార్పొరేట్లు దేశమంతా పండిన పంటను ఎత్తుకుపోయే అవకాశం మోడీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం ఇపుడు 30 శాతం పంట మాత్రమే కొంటున్నది. ఇక ముందు అదీ కొనదు. మార్కెట్ మొత్తం కార్పొరేట్ల కైవశం చేస్తున్నది. ముందు ముందు కార్పొరేట్లు ఎంత ఇస్తే రైతు అంత పుచ్చుకోవలసిందే. కౌలు రైతు ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. ఎప్పటికైనా భూమి పంపిణీ జరిగి తనకు భూమి వస్తుందని ఆశించిన భూమి లేని ప్రజలు, వ్యవసాయ కార్మికుల ఆశ దీనితో కలగానే మిగిలిపోతుంది.
ఇక ధరలు వారే నిర్ణయిస్తారు
మరో ఆర్డినెన్సు సరుకు నిల్వపై గరిష్ట పరిమితి ఎత్తివేసింది. ఇక ఎంతైనా నిల్వ చేయవచ్చు. ధరలపై నియంత్రణ మినహాయింపు ఇవ్వడంతో నిత్యావసర సరుకుల ధరలు కార్పొరేట్ ఇష్టమే. పంటంతా కార్పొరేట్లదే. నిత్యావసర మార్కెట్టూ వాళ్లదే. రైతు వద్ద పంట కొనే ధర, వినిమయదార్లకు నిత్యావసరాలు అమ్మే ధర రెండూ నిర్ణయించే శక్తి కార్పొరేట్లకు మోడీ కట్టబెట్టారు. కత్రిమ కరువు సష్టించి నిత్యావసరాలు ఎంతకైనా కార్పొరేట్లు అమ్ముకోవచ్చు. ఇక వారు దోచుకున్నంత దోచుకోవడమే. కార్పొరేట్ ఔదార్యంపై ఆధారపడి పంట పండించిన రైతు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, వత్తిదారులు, సమస్త దేశ శ్రమజీవులు బతకాల్సిన దుస్థితికి మోడీ నెట్టేశారు.
లాభాలే ప్రధానం
కార్పొరేట్లకు దేశం మీద ప్రేమ, అభిమానం వంటి సెంటిమెంట్లు ఉండవు. జాతీయ దురహంకారం రెచ్చకొట్టేది లాభం కోసమే తప్ప దేశం కోసం కాదు. ప్రజలను చౌకగా దొరికే చైనా సరుకులు కొనొద్దని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం ముడిసరుకులు అదే చైనా నుండి చౌకగా దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్లకు లాభమే ముఖ్యం. అందుకు ఎంతటి దారుణాలకైనా తెగబడతారు. కరోనా వైద్యానికి సంబంధించి వారి అమానుషత్వం అర్థమైంది కదా? అన్నింటా వారు ఇలాగే వుంటారు. ఇతర దేశాల్లో ఏ పంటకు ఎక్కువ ధర వస్తే రైతుతో అదే పంట వేయిస్తారు. మన ప్రజలను పస్తులు పెట్టి విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేస్తారు. బ్రిటిష్ పాలకులు భూమిని వాణిజ్య పంటలకు తరలించిన ఫలితంగా... తిండి గింజలు లేక లక్షల మంది భారతీయులు ఆకలితో మరణించిన చరిత్ర మనకు తెలుసు. మోడీ, బిజేపి విధానాలు తిరిగి అదే గతి పట్టిస్తాయి. ఆ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలి.
కార్మిక, పౌర హక్కులపై దాడి
పెట్టుబడిదార్ల దోపిడీ, దౌర్జన్యం నుండి తనను తాను రక్షించుకు నేందుకు కార్మిక వర్గం 200ఏళ్లపాటు పోరాడి... ప్రాణత్యాగాలు చేసి మరీ ఉద్యోగ భద్రత, సంఘ నిర్మాణం, జీతభత్యాలు తదితర కార్మిక హక్కులను సాధించుకుంది. మోడీ ప్రభుత్వం ఇప్పుడు వాటిని తొలగించి కార్మికులను దేశ విదేశీ కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చే చట్ట సవరణలు చేస్తున్నది. మరోవైపు కార్మికులు, రైతులు, దళితులు, గిరిజనులు, సంచార జాతులు తదితరుల హక్కుల కోసం నిలిచే కమ్యూనిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై బ్రిటిష్ పాలకులు తయారు చేసి, ఉపయోగించిన 'దేశద్రోహ' చట్టాన్ని బనాయించి అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి నెడుతున్నది. ప్రజల పక్షాన నిలబడేవారు లేకుండా కుట్రలు చేస్తున్నది. కష్టజీవుల ఐక్యతను దెబ్బ తీసేందుకు 'విభజించి పాలించు' కుట్రలు చేస్తున్నది. హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలను సష్టిస్తున్నది. అన్నదమ్ముల వలే మెలిగే ప్రజల్లో కులతత్వం ప్రకోపింపచేసి అనైక్యత కలుగచేస్తున్నది. మోడీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని కట్టడి చేసి ప్రజలను రక్షించలేదు. ఆర్థికంగా కనీస సహకారం చేయలేదు. అర్ధాంతరంగా లాక్డౌన్ విధించి వలస కార్మికులను రోడ్డు మీద పడేసింది.
కరోనా వలన ప్రజలు కదిలి పోరాడలేని సమయం ఇదేనని భావించిన మోడీ ప్రభుత్వం మొత్తం దేశ వ్యవసాయం, మార్కెట్ను సైతం విదేశీ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెబుతున్నది. కార్మికులు, కర్షకులపై మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడి...వారికే పరిమితం కాదు. కార్పొరేట్లు ధరలు పెంచి ప్రజలందరి రక్తం తాగేస్తారు. కనుక ముందే మేల్కొని భూమిపై రైతు ఆధిపత్యం, కార్మిక హక్కులు, ప్రజలకు ఆహార భద్రత, మార్కెట్లు, ధరలపై ప్రభుత్వ నియంత్రణను కాపాడుకోవాలి. మోడీ విధానాలు తిప్పికొట్టేందుకు రైతు, కౌలు రైతు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళనను ప్రజలంతా బలపర్చాలి.
- ఎం. కృష్ణమూర్తి