Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వం పరిశోధక విద్యార్థులను పరిశోధన నుండి దూరం చేసే చర్యలకు పాల్పడుతోంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి ఫెలోషిప్లను క్రమేణా తగ్గిస్తూ వస్తుంది. గడిచిన నాలుగేండ్ల కాలన్ని పరిశీలిస్తే 50శాతం మేర తగ్గించిందనే వాస్తవం తేటతెల్లమవుతుంది. 2016లో 9,503 విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్లు వస్తే 2021 నాటికి 3,986 ఫెలోషిప్లకు కుదించారు. దీనిలో మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ 2016లో 4,141 విద్యార్థులకు ఇస్తే నేడు 2,343కి తగ్గించారు. వీటితో పాటు పోస్టు డాక్టరోల్ ఫెలోషిప్ (పిడిఎఫ్) 2016లో ఉన్న 554 నుండి నేడు 332 మాత్రమే ఇచ్చారు. దీనితో పాటు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎస్ రాధాకృష్ణ పేరు మీద ఇచ్చే ఫెలోషిప్లు కూడా భారీగా తగ్గించారు. గతంలో యూజీసీ మెరిట్ విద్యార్థుల ఫెలోషిప్ 600మంది విద్యార్థు లకు ఇస్తే నేడు కేవలం 14మంది విద్యార్థు లకు మాత్రమే ఇవ్వడమంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్ణయాల వలన పేద, సామాజిక తరగతుల విద్యార్థులు పరిశోధనకు దూరమావు తున్నారు. ఇచ్చే ఫెలోషిప్లకు నోటిఫికేషన్లు కూడా రెగ్యులర్గా ఇవ్వడం లేదు. బీసీ విద్యార్థులకు ఫెలోషిప్ నోటిఫికేషన్ రాక రెండేండ్లు కాలం గడిచి పోయింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణం గా స్లాట్స్ను కూడా పెంచలేదు. ఇచ్చే ఫెలోషిప్ కూడా రెగ్యులర్గా ఇవ్వడం లేదు. జేఆర్ఎఫ్ ఫెలోషిప్ను ఆరు నెలలకు ఒక్కసారి విద్యార్థికి ఇస్తున్నారు. 2020లో ఐసిఎస్ఎస్ఆర్ ఫెలోషిప్కి నోటిఫికేషన్ ఇచ్చి అందరూ అప్లయి చేసుకొన్నాక సరైన కారణం చెప్పకుండానే నోటిపీకేషన్ తిరిగి రద్దు చేశారు. ఇచ్చే ఫెలోషిప్లలో కూడా పార దర్శకత లోపిం చింది. ప్రభుత్వా తరతనికి అనుకూలంగా ఉన్నవాళ్లకు వాళ్ళ అనుబంధ విద్యార్థులకు మాత్రమే ఫెలోషిప్లలో ప్రధాన్యత ఇవ్వడం బహిరంగ రహస్యంగా మారింది. గతంలో యూజీసీ నుండి నాన్ నెట్ ఫెలోషిప్ ఎన్ఏఏసీ (ఏ గ్రేడ్) గుర్తింపు సాధించిన ప్రతి యూనివర్సిటీ విద్యార్థులకు నాన్ నెట్ ఫెలోషిప్ పేరుతో రూ.8 వేలు ఇచ్చేది. ఇప్పుడు ఈ ఫెలౌషిప్ను నాలుగేండ్ల నుండి ఇవ్వడం లేదు. సోషల్ సైన్స్ సబ్జెక్ట్ లలో విద్యార్థుల పట్ల వివక్షత ఉంది. యోగ, కర్మ, జ్యోతిష్యం లాంటి సబ్జెక్టులకు ప్రాధాన్యత కనపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల మరింత వివక్ష కనపడుతుంది. జాతీయ ఫెలోషిప్ రావాలంటే నెట్ పాస్ తప్పనిసరి అనే హేతుబద్ధత లేని నిబంధనను తీసుకో వచ్చి విద్యార్థులను ఫెలోషిప్కి దూరం చేస్తున్నారు. దీని వెనుక మోడీ ప్రభుత్వ కుట్ర దాగి ఉందనేది నగ సత్యమే. ఎందుకంటే ఫెలోషిప్ ఇవ్వడం వలన అణిచివేయబడిన జాతుల జీవితాలు, అసమానతలు, మను ధర్మ శాస్త్ర కుట్రలు, ఆర్థిక దోపిడీ తదితర కీలకమైన అంశాల మూలాల నుండి రీసెర్చ్ జరుగు తున్నాయి. కాబట్టి ఇది మోడీ ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి పరిశోధనలు జరిగి వాస్తవాలు ప్రజల మధ్యకొస్తే పెట్టుబడిదారుల దోపిడీ ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే ఫెలోషిప్లకు కోత పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చేసే విద్యార్థులు ఎవరైనా యూజీసీ పొందుపరిచిన అంశాల మీదనే రీసెర్చ్ చేయాలనే కొత్త నిబంధనను పెడుతున్నట్లు ప్రకటించారు. దీనిని బట్టి వీళ్లకు పరిశోధన అంటే ఎంత బయమో అర్థమతుంది.
విశ్వవిద్యాలయాలు మోడీ ప్రభుత్వా ప్రజా వ్యతిరేక, నియంతృత్వ విధానాలను ప్రశ్నించే పోరాట కేంద్రాలుగా మారాయి. దీనిలో అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్ ఫెలోషిప్ కలిగిన విద్యార్థులు ఈ ఉద్యమా లకు నాయకత్వం వహిస్తున్నారు. నోట్ల రద్దు నుండి సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ మొదలు కొని రైతు వ్యతిరేక చట్టాల వరకు ప్రతి విషయంలో మోడీ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండ ఉద్యమాలు చేసారు. ఇది భరించలేని మోడీ ప్రభుత్వ కుట్రలో భాగం గానే ఫెలోషిప్ను తగ్గిస్తున్నా రనేది వాస్తవం. ఏదేశమైనా అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే ఆ దేశాలలో పరిశోధనలు విస్తృతంగా జర గాలి. అలా జరగకుండా నిరోధించడ మంటే దేశాభివృద్ధిని నిలవరిం చడమే అవుతుంది.
- ఆర్.ఎల్.మూర్తి
సెల్: 8247672658