Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంతో భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని విడదీసి చూడలేం. 1914 - 18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధకాలంలో రష్యన్ విప్లవ ప్రభావంతో భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించింది. భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తూ, అక్టోబరు విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులై భారత్ తిరిగి వచ్చిన వారూ, ఖిలాఫత్, హిజ్రత్ ఉద్యమాలపై అక్టోబరు విప్లవ ప్రభావం వల్ల కమ్యూనిస్టులైన వారూ, గదర్ పార్టీ నుంచి కమ్యూనిస్టులుగా మారినవారూ, భారతదేశంలోనే రష్యా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులైన అతివాద కాంగ్రెస్ వారూ - ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఉద్యమకారులు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీకి పునాది వేశారు. 1920 అక్టోబరులో తాష్కెంట్లో పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఎం.ఎన్.రారు ప్రభృతులతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు.
సంపూర్ణ స్వాతంత్య్రం కోసం తొలిసారి నినదించింది కమ్యూనిస్టులే. ప్రజాసంఘాల ద్వారా రైతు కార్మిక పోరాటాలను నడిపింది కమ్యూనిస్టులు. హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో మహత్తరమైనది. భారతదేశ విప్లవానికి దిక్సూచిగా మారింది. అయితే పార్టీలో సైద్ధాంతిక విబేధాలు కూడా ఆకాలంలోనే ప్రారంభమయ్యాయి. చివరికి అది 1964లో సీపీఐ(ఎం) ఏర్పాటుకు దారి తీసింది.
1964 ... భారత కమ్యూనిస్టు ఉద్యమంలో నిజంగా ఒక మూలమలుపు. ఆ సంవత్సరంలోనే కలకత్తాలో పార్టీ 7వ మహాసభ జరిగింది. డిసెంబరు మాసంలో జరిగిన ఆ మహాసభలోనే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆవిర్భవించింది. దశాబ్దకాలానికి పైగా ఉమ్మడి పార్టీలో జరిగిన తీవ్రమైన సైద్ధాంతిక పోరాటానికి తుది ఘట్టం ఈ మహాసభ.
కమ్యూనిస్టు పార్టీ విప్లవాన్ని సాధించి సమాజంలో మౌలిక మార్పు కోసం పోరాడుతుంది. దోపిడీ వర్గ పాలన స్థానంలో కార్మికవర్గం నాయకత్వాన కష్టజీవుల రాజ్యాన్ని సాధించడమే ఈ విప్లవం లక్ష్యం. విప్లవాన్ని సాధించాలంటే కచ్చితమైన పథనిర్దేశం అవసరం. వర్గ శత్రువులు ఎవరు అన్న విషయంపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి. ఈ మౌలిక విషయాలపైనే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలు నెలకొన్నాయి.
స్వాతంత్య్రా నంతరం అధికారంలోకి వచ్చిన నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, మౌలికంగా సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నదని ఒక వర్గం గట్టిగా భావించింది. కాంగ్రెస్తో కలిసి జాతీయ ప్రజాస్వామ్యాన్ని సాధించడం ద్వారా సోషలిజం వైపుకు సాగిపోవచ్చునని వారు ప్రతిపాదించారు.
ఇది వర్గ సంకర విధానమని, రివిజనిస్టు ధోరణి అని మరొక వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. స్వాతంత్య్రానం తరం అధికారంలోకి వచ్చింది బడా బూర్జువా నాయకత్వంలోని బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వమని, సామ్రాజ్య వాదంతో మిలాఖత్తు అయ్యే ప్రభుత్వమని, దీనిని సమూలంగా నిర్మూలించి ఆ స్థానంలో కార్మికవర్గం నాయకత్వాన జనతా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారానే సోషలిజం దిశగా సాగిపోవచ్చునని వీరు ప్రతిపాదించారు.
ఈ రెండు పరస్పర విరుద్ధ ధోరణుల మధ్య తీవ్రమైన సైద్ధాంతిక పోరాటం జరిగింది. 1962లో విజయవాడలో జరిగిన పార్టీ 6వ మహాసభలో రెండు కార్యక్రమాలు, రెండు రాజకీయ తీర్మానాల ముసాయి దాలతో ఇరుపక్షాలూ తలపడ్డాయి. పార్టీ చీలికను నివారించే ఉద్దేశంతో కార్యక్రమం, రాజకీయ తీర్మానం ఆమోదించకుండా వాయిదా వేశారు. ఆనాటి పార్టీ ప్రధాన కార్యదర్శి అజరుఘోష్ ఉపన్యాసాన్నే రాజకీయ తీర్మానంగా భావించి తాత్కాలికంగా ఐక్యతను కాపాడారు. ఆతర్వాత కొద్దిరోజుల్లోనే భారత్ - చైనా యుద్ధం వచ్చింది. ఈ సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని అన్నందుకు ఉమ్మడి పార్టీలోని సిపిఎం నాయకత్వాన్ని జాతి విద్రోహులని ముద్ర వేశారు. మొత్తం నాయకులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించింది. ఈనాడు చైనా పట్ల అన్ని పార్టీలూ తీసుకుంటున్న వైఖరి గమనిస్తే ఆనాడు సీపీఐ(ఎం) తీసుకున్న వైఖరి ఎంత సరైందో అర్థమవుతుంది.
అయినప్పటికీ మార్క్సిస్టులు సైద్ధాంతిక పోరాటాన్ని విరమించలేదు. 6వ పార్టీ మహాసభ నాటి సభ్యత్వం ప్రాతిపదిక మీద మహాసభ నిర్వహించి కార్యక్రమం, రాజకీయ తీర్మానాలను ఆమోదిద్దామని ప్రతిపాదించారు. నాటి సీపీఐ నాయకత్వం ససేమిరా అన్నది. ఈ దృక్పథాన్ని వ్యతిరేకించేవారు జాతీయ కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసి బయటికొచ్చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మార్క్సిస్టులు ప్రత్యేకంగా మహాసభ జరుపుకోవాలని నిర్ణయించారు. దీనికి సన్నాహంగానే తెనాలి సదస్సు జరిగింది. కలకత్తాలో జరిగిన ఏడవ మహాసభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. వర్గ సంకర విధా నాలకు తావులేని కార్యక్రమాన్ని, రాజకీయ విధానాన్ని ఆమోదిం చింది. అత్యధిక పార్టీ సభ్యుల మద్దతు పొంది, ప్రజాదరణ కలిగిన సీపీఐ(ఎం) కార్యక్రమాన్ని రెండు అంతర్జాతీయ పెద్ద కమ్యూనిస్టు పార్టీలైన సోవియట్, చైనా వ్యతిరేకించాయి.
అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ మద్దతు లేనివారు ఇంత పెద్ద ఎత్తున మహాసభను నిర్వహించగలరని ఎవ్వరూ ఊహించలేదు. మహాసభ వేదికపై కమ్యూనిస్టు ఉద్యమ హేమాహేమీలు కామ్రేడ్స్ పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్, ముజఫర్ అహ్మద్, మాకినేని బసవ పున్నయ్య, ప్రమోద్దాస్ గుప్తా, పి.రామమూర్తి, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, జ్యోతిబసు, హరికిషన్సింగ్ సూర్జిత్లాంటి వారు ఆశీనులయ్యారు. పేరు గాంచిన విప్లవ వీరులు, గదర్ పార్టీకి చెందిన వారు, భగత్సింగ్ అనుచరులు, అనుశీలన్ జుగన్తారలలో సభ్యులుగా పని చేసిన వారు మహాసభల్లో ప్రతినిధులుగా పాల్గొన్నారు. అనేక కార్మికవర్గ పోరాటాల్లోనూ, తెలంగాణా సాయుధ పోరాటం లాంటి రైతాంగ పోరాటా ల్లోనూ పాల్గొన్న యోధులెందరో ఆ మహాసభలో తారల్లా మెరిశారు. వీటన్నింటినీ మించి పార్టీ సభ్యత్వాన్ని కదిలిం చడంలో ఈ మహా సభ ఘన విజయం సాధించింది. మొత్తం లక్షా 75వేల పార్టీ సభ్యత్వం ఉంటే లక్షా 40వేల మంది ఈ మహాసభల్లో పాలు పంచుకున్నారు. ఈ చారిత్రాత్మక మహాసభ బూర్జువా, భూస్వామ్య పాలకుల వెన్నుల్లో వణుకు పుట్టించింది.
మహా నేతలను సృష్టించిన మామూలు మనిషి అమీర్ హైదర్ఖాన్ 1900లలో పంజాబ్ రాష్ట్రంలోని కలియన్ వలియన్ గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. జాతీయోద్యమంలో పనిచేస్తున్న తన అన్నను వెతుక్కుంటూ అమీర్ హైదర్ఖాన్ తన 15వ ఏట బొంబాయి చేరాడు. ఓడ కార్మికుడుగా, పేపర్ బారుగా, మోటారు మెకానిక్గా పనిచేశాడు. విమాన పైలట్గా, మెరైన్ ఇంజనీరుగా కూడా తర్ఫీదు అయ్యాడు. పనిచేసుకుంటూనే ఆయన అమెరికా, జపాన్, సోవియట్ యూనియన్ వంటి దేశాలకు వెళ్లాడు. గదర్ పార్టీతో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ దశలో ఆంగ్లేయ సీపడీల నుంచి తప్పించుకొని అమెరికా వెళ్లాడు. అమెరికన్ వర్కర్స్ పార్టీ సభ్యుడయ్యాడు. వారి సహకారంతో మాస్కోలోని ప్రాచ్య దేశాల విశ్వవిద్యాలయంలో మార్క్సిస్టు సిద్ధాంత శిక్షణ పొందాడు. అంతర్జాతీయ సంస్థ కొమిరిటరన్తో సంబంధాలు ఏర్పరుచుకొని వారి సహాయంతో దక్షిణ భారత దేశం చేరి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుం కట్టారు.
మద్రాస్ రైల్యే ఉద్యోగి మాత్యూ, ఆయన కింద పనిచేసే అప్రెంటీస్ వెంకట్రామన్తో పరిచయాలు పెంచుకున్నారు. ఆ తరువాత స్వాతంత్రో ద్యమంలో చదువు మానేసిన విద్యార్ధుల బోగట్టాను సంపాదించి వారితో పరిచయాలు పెట్టుకున్నారు. ఈ క్రమం లోనే కంభం పాటి సత్య నారాయణతో పరిచయ మైంది. ఆయన కుటుంబాన్ని మద్రాసుకు మార్పించారు. కమ్యూ నిస్టు ఉద్యమ నిర్మాణంలో పాత్ర దారుడ్ని చేశారు. బెంగుళూరులో సుందరయ్యగారి గురించి విని ఆయనను కలిశారు. ఆయననూ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఒప్పించారు. ఇదే కాలంలో డాక్టర్ అచ్చమాంబతోనూ పరిచయం పెంచుకున్నారు.
వీరందరినీ యంగ్ వర్కర్స్ లీగ్కింద సమీకరించి సిద్ధాంత అధ్యయానికి పుర మాయించారు. అప్పటికే ఆయన ప్రత్యేకంగా సంపాదించిన 'రాజ్యాంగ యంత్రం, విప్లవం'పై మార్క్స్ పుస్తకాలను చదివించారు. ఒక్కొక్క సభ్యునితో ఒక్కొక్క పేరా చదివిస్తూ దానిపై మరొకరితో వివరణ ఇప్పించేవారు. ఆ వివరాలను నిత్య జీవితానికి జోడిస్తూ అమీర్హైదర్ ఖాన్ అనేక ఉదాహరణలు ఇచ్చేవారు. ఇందుకోసం ఆయన ఇంగ్లీష్, తమిళ భాషల్లో కనీసార్హత సాధించారు. ఒక్కోసారి ఫ్యాక్టరీల వద్దకు తీసుకెళ్లి అక్కడి కార్మికుల స్థితిగతుల్ని చూసి మార్క్స్ బోధనలకూ వాస్తవ పరిస్థితికీ, జీవితానికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించి చెప్పేవారు.
పనివేళలు పూర్తయ్యాక ఫ్యాక్టరీ నుంచి వెలుపలికొచ్చే కార్మికులను చూపుతూ 'మార్క్స్ పేర్కొన్న కార్మిక సైన్యం' అంటూ విప్లవ సాధనలో దాని అనివార్య పాత్రను విశ్లేషించేవారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఉండగా పోలీసులు అమీర్ హైదర్ ఖాన్ జాడ గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఆయన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ బాధ్యతను సుందరయ్య గారికప్పగించి మాస్కో వెళ్లాడు. ఆకలిని జయించే జీవన సమరంలో అమీర్ హైదర్ఖాన్ కమ్యూనిస్టు కావడమే కాక సుందరయ్య, కంభంపాటి, అచ్చమాంబలాంటి విద్యాధికుల్ని కమ్యూ నిస్టులుగా మార్చారు.