Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ప్రచారం చేసేరు.. నమ్మునోడికి నమ్మినంత.. నమ్మనోడికి నమ్మనంత' అన్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ తెగ పోస్టులు పెట్టేస్తూనే ఉంది. యువతా ఆ ట్రాప్లో పడుతూనే ఉంది. అరె రోజంతా బీజేపీ భజన చేయడమేగా వర్సిటీ పనిగదా? కొత్తేముంది? అనుకోకండి. గా శృతిమించిన భజన పోస్టులే ముఖ్య నేతలకు తిక్కరేగేలా చేస్తున్నాయి. తుక్కుగూడ సభలో బండి సంజరు చేయిపైకెత్తి అమిత్షా అభివాదం చేస్తే.. వాట్సాప్ వర్సిటీ మాత్రం కాబోయే తెలంగాణ సీఎం బండి సంజరు అని ప్రకటించినట్టు తెగ వైరల్ చేసేసింది. టీవీల్లో లైవ్ చూసినోళ్లకు, పేపర్లు చదివినోళ్లకు అది ఎక్కడా కనిపించకపోవడంతో వర్సిటీ ప్రచారంలో వీసమెత్తయినా నిజంలేదనీ, అది కట్టుకథ అని తేలిపోయింది. మరుసటి రోజు ఖమ్మం పోతున్న బండి సంజరుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసిండంట? పాదయాత్రను పొగిడిండంట? తెలంగాణకు అమిత్షా, మోడీలు ఎందుకయ్యా.. బండి ఒక్కడే సరిపోతడులే అన్నడంట? గీ ముచ్చట్లను కూడా వాట్సాప్ వర్సిటీ తెగ వైరల్ చేసేసింది. ఓ రాష్ట్ర అధ్యక్షునిగా బండికి మోడీ ఫోన్ చేస్తే చేసిండొచ్చుగానీ.. 'అదిగో పులి.. ఇదిగో తోక...' అన్న చందంగా భజన బ్యాచ్ ఉన్నవి లేనివి ప్రచారంలో పెట్టేసిందనే చర్చ నడుస్తున్నది. గివన్నింటినీ చూసి కిషన్రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, ఈటల, తదితర ముఖ్యనేతలంతా గుర్రవుతున్నరంట. వ్యక్తిపూజేందిరబై? 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్ననాడైనా గిట్లజేయలే? ఇన్నేండ్ల నుంచి పార్టీ కోసం మేమేం చేయలేదా? ఆయనొక్కడే పోటుగాడా? అని గుస్సా అవుతున్నరంట. అందర్నీ భయపెట్టేందుకు మెడలో వేసుకున్న పాము చివరకు ఆ మెడలో వేసుకున్న వాణ్నే కరిచినట్టు అబద్దాల పుట్టలో నుంచి పుట్టుకొచ్చిన వాట్సాప్ వర్సిటీ విషసర్పం ముఖ్య నేతల స్థాయి తగ్గిస్తూ బండికి భజన చేస్తుండటంతో బీజేపీ పార్టీలో లోలోపల పంచాయితీ షురూ అయితున్నట్టే కనిపిస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే బండితీరుపై రాజాసింగ్ రచ్చచేస్తే పార్టీ బుజ్జగించిన సంగతీ తెలిసిందే.
- అచ్చిన ప్రశాంత్