Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందస్తు ఎన్నికలు అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు అభ్యర్థుల్లోనూ ఉత్కంఠను రేపాయి. అనేక గందరగోళాలు, అయోమయాల మధ్య పోలింగ్ ముగిసింది. పార్టీలు, అభ్యర్థుల చేతిచమురు బాగానే వదిలింది. దాదాపు మూడు నెలలుగా ఎన్నికల తంతు రాష్ట్రంలో కొనసాగుతున్న తరుణంలో ఓటరు తీర్పు ఈనెల 11న వెలువడనుంది. అప్పటి వరకు అభ్యర్థులంతా ఉత్కంఠను ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపు గుర్రమెక్కాలని అందరూ అనుకుంటున్నా, ఓటర్ల తీర్పు ఈ మారు ఆయా పార్టీల నేతలకు చెమటలు పట్టిస్తుందనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఎవరు గెలిచినా బయటకు నవ్వి, ఇంట్లో ఏడ్వాల్సిందేనని అంటున్నవారూ లేకపోలేదు. ఎన్నికల కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా, ఖర్చు మాత్రం హద్దుదాటి పోయిందని అంటున్నారు.
- బి.బసవపున్నయ్య