Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ ఆధ్వర్యంలోని కార్మికులు చెన్నైలోని 'ఇండియా యమహా ప్రయివేట్ లిమిటెడ్'కు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె 55 రోజుల అనంతరం విజయం సాధించింది. సెప్టెంబర్ 20, 2018 నాడు ఏ విధమైన ముందస్తు నోటీస్ లేకుండా కంపెనీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులను తొలగించడమే ఈ సమ్మెకు కారణం. సీఐటీయూ అనుబంధ 'ఇండియా యమహా మోటార్ తోజిలల్లార్ సంఘం'లో సభ్యులుగా చేరడమే వారిరువురి తొలగింపునకు కారణం.
తొలగించబడిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలనే నికరమైన పోరాట పటిమ, ఉద్యోగుల ఐక్యత వల్లనే ఈ విజయం సాధ్యపడింది. 'స్టేట్ ఇండిస్టీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు'కు చెందిన కార్మికుల యొక్క బలమైన మద్దతు కూడ ఈ పోరాటానికి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా తమిళనాడు సీఐటీయూ శాఖ 'యమహా షోరూం'ల ముందు ప్రదర్శనలు నిర్వహించింది. దాదాపు తమిళనాడులోని అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఈ ఉద్యమానికి సంఘీభావం పలికాయి.
ఈ సమ్మె అనేక అనుభవాలనిచ్చింది. కాంచీపురం కార్మికోద్యమ చరిత్రలో ఇదొక గొప్ప పోరాటం. రైతు, యువజన, మహిళ, మధ్య తరగతి సంఘాలతోపాటు, దాదాపు 53సంఘాలు ముందుకు వచ్చి ఈ సమ్మెకు మద్దతు పలికాయి. వారు 4.5లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన మానవహారాలు, పాదయాత్ర, బహిరంగ సభలకు అన్ని రాజకీయ పార్టీలు హాజరై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.
సమ్మె జరుగుతున్న కాలంలో ఉద్యోగులపై పైచేయి సాధించడానికి యాజమాన్యం అనేకులను మధ్యవర్తులుగా పంపించింది. ఉద్యోగులందరు తిరిగి పనిలోకి రావాలని, అలా పనిలోకి తిరిగి వచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు యివ్వబడతాయని యాజమాన్యం నాలుగు పర్యాయాలు లేఖలు పంపించింది. యాజమాన్యానికి చెందిన కొందరు, మానవవనరుల శాఖకు చెందిన అధికారులు ఉద్యోగుల ఇండ్లకు కూడా వెళ్ళి వారిని లోబరుచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. సమ్మె చేస్తున్న ఉద్యోగులే కాదు, వారి కుటుంబాలు కూడా సమ్మెకు అండగా నిలబడినాయి. ఉద్యోగులు, ప్రజల నుంచి నిరంతర ఒత్తిడి కారణంగా యాజమాన్యం దిగిరాక తప్పలేదు.
ఏకపక్షంగా ఇద్దరు ఉద్యోగులపై తీసుకున్న చర్య ఫలితంగానే ఈ సమ్మె జరిగినట్టుగా కనపడుతుంది. వాస్తవానికి, అనేక శక్తులను ఏకం చేసిన ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా అసంతృప్తి రగులుతూ వచ్చింది. నయా ఉదారవాద సంస్కరణలు ఏర్పడిన మూడు దశాబ్దాల కాలంగా, 2008 వరకు ఈ ప్రాంతంలో ఏ సంఘం రూపుదిద్దుకోలేదు. ఆసక్తికరంగా, చెన్నరు 'ఆసియా డెట్రాయిట్'గా పిలవబడింది. 1960 నుంచి చెన్నరులో, సెమీ అర్బన్ చెన్నరులో అనేక పరిశ్రమలు (aబ్శీ-baరవస) అభివృద్ధి చెందాయి. ప్రపంచీకరణ అనంతరం యు.ఎస్.కు సంబంధించిన ఫోర్డ్, దక్షిణ కొరియాకు సంబంధించిన హ్యుండారులు రెండు పెద్ద కంపెనీలు, ఆ పిమ్మట అనేక చిన్న చిన్న యూనిట్లు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. యిప్పుడు సెమీ అర్బన్ చెన్నరులో 1000కి పైగా పెద్ద, చిన్న పరిశ్రమలు ఆటోమొబైల్ రంగం, ఎలక్ట్రానిక్స్ రంగం, కెమికల్ Ê ఇంజినీరింగ్ రంగానికి చెందినవి ఉన్నాయి.
హ్యుండారు ఉద్యోగులు 2008లో సంఘాన్ని ప్రారంభించారు. అణచివేత ధోరణులుండేవి, కానీ సీఐటీయూ ఆ సంఘానికి అండగా నిలిచింది. ఆ తరువాత ఫాక్స్కాన్, యితర కంపెనీలలో సంఘాలు ఏర్పడ్డాయి. 2012 నుంచి కొన్ని పరిశ్రమలలో యాజమాన్యాలు సీఐటీయూను గుర్తించడం ప్రారంభిం చాయి. ఆ సంఘాలతో ఒప్పందాలు చేసుకొని సంతకాలు చేయడం కూడా ప్రారంభించాయి.
గడచిన పదేండ్ల కాలంలో, ఉద్యోగులు సంఘాలు రూపొందించుకునే క్రమంలో ఆత్మగౌరవమే ప్రధానమైన లక్ష్యంగా కనపడుతూ వచ్చింది. వేతనాలు రెండవ లక్ష్యంగా కనపడింది. యాజమాన్యాలు వారి ఉద్యోగులను చిన్నచూపు చూసే వైఖరి కలిగి వున్నాయి. శిక్షణ పూర్తి అయిన పిమ్మట, ఉద్యోగులు రూఢ పత్రాన్ని కోరుకుంటారు. కానీ యాజమాన్యాలు అనేక సందర్భాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయాలని, గదులలోని బూజు దులపాలని ఒత్తిడి చేస్తాయి. ఈ ఉద్యోగులు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా తీసుకోబడినవారు. వీరంతా ఐటీఐ శిక్షణ పొందిన లేక డిప్లొమా సర్టిఫికేట్లు పొందినవారే. కానీ వారంతా చిన్నచూపు చూడబడుతూ, అవమానించబడుతున్నారు.
యమహా ఉద్యోగులు సంఘాన్ని రూపొందించుకోవడానికి కారణమైనాయి. ఇవే చర్యలు రాయల్ ఎన్ఫీల్డ్, యితర అనేక బహుళజాతి కంపెనీలలో అనుసరించబడినాయి. కార్మికుల ఆత్మగౌరవానికి చెందిన విషయాలను యాజమాన్యాలు లేదా కార్మికశాఖలు అర్థం చేసుకోలేదు. బహుళజాతి కంపెనీలలో ప్రజాస్వామ్యం కూడా ఒక సమస్యగా తయారైంది. ఈ అంశాలన్నీ కార్మికులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునేటట్లు చేశాయి.
జూలై 29వ తేదీన, 550పైగా ఉద్యోగులు ఒక జనరల్బాడీ సమావేశాన్ని నిర్వహించి, సీఐటీయూకు అనుబంధంగా 'ద యమహా ఇండియా మోటార్ తోజిలల్లార్ సంఘం' అనే సంఘాన్ని రూపొందించుకున్నారు. ఎనిమిది మంది ఆఫీసు బేరర్లతో సహా, సౌందర్ రాజన్ అనే ఒక ఉద్యోగి ఆ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోబడినాడు. ఆగస్ట్ 10న కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ కొరకు ఒక దరఖాస్తు, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం నందు సమర్పించబడింది. దానికంటే ముందు, యాజమాన్యం ఉద్యోగుల యొక్క ఐక్యతను అంచనా వేయలేకపోయింది. యమహాకు ఒక బలమైన ఉత్పత్తి పునాది భారతదేశంలో ఉన్నది. ఇది ఇంకా రెండు పరిశ్రమలను సూరజ్పూర్, ఫరీదాబాద్లలో కలిగి ఉన్నది. చెన్నరు ప్లాంట్ 2014లో ప్రారంభమయింది. యాజమాన్యం దీనిని ఒక కలల పరిశ్రమగా చెప్పుకుంటుంది. దీనిలో 812 మంది పర్మినెంట్ కార్మికులు, 4000 మంది కాంట్రాక్ట్, శిక్షణలో వున్న కార్మికులు ఉత్పత్తి పనిలో మునిగి ఉంటారు. సహాయక చిన్న పరిశ్రమలు 5000మంది ఉద్యోగులను (కాంట్రాక్ట్, శిక్షణా కార్మికులుగా) కలిగి ఉన్నాయి. ఈ సహాయక చిన్న పరిశ్రమ నాలుగేండ్ల కాలంలో తన ఉత్పత్తిని రోజుకు 200యూనిట్ల నుంచి రోజుకు 2100 యూనిట్లకు పెంచుకున్నది. సూరజ్పూర్, ఫరీదాబాద్ పరిశ్రమలలో యిప్పటికే హెచ్ఎంఎస్కు అనుబంధం గా వున్న కార్మిక సంఘాలున్నాయి. కానీ యమహా యాజమాన్యం, చెన్నరులో కార్మిక సంఘం అవసరం లేదని చెపుతోంది. వాస్తవానికి యాజమాన్యం ఒక్కసారి ఆఫీసు బేరర్ల పేర్లు చూడడంతోనే సంఘాన్ని లేకుండా చేయాలని అనుకున్నది.
మొదట యాజమాన్యం ఒక ఉద్యోగిని, సీఐటీయూ అనుబంధ సంఘాన్ని వదిలి, సీఐటీయూకు అనుబంధంగాలేని సంఘానికి అధ్యక్షునిగా ఉండమని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆ వ్యక్తి అందుకు నిరాకరించాడు. తరువాత యాజమాన్యం ఆఫీసు బేరర్లను అదే విధంగా ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ లాభం లేకపోయింది. ఈ పరిస్థితిలో కార్మిక సంఘం లేబర్ కమిషనర్ను కలిసి ఇండిస్టియల్ డిస్ప్యూట్ యాక్ట్లోని సెక్షన్ '2కే' క్రింద ఒక వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సెప్టెంబర్ 20న, కార్మికశాఖ ఇరువురి మధ్య సఖ్యత కుదర్చడానికి పిలిపించింది. కానీ, ఆ సమావేశానికి హాజరవడానికి ఆఫీసు బేరర్లకు అనుమతి లభించలేదు. అందులో నలుగురు ఒక పూట సెలవు కోరవలసి వచ్చింది. వారు గేటు వద్దకు చేరుకున్న మీదట, అందులోని ఇద్దరికి ఏ విధమైన ముందస్తు నోటీస్ లేకుండా తొలగింపు ఉత్తర్వులు అందించబడినాయి. కేవలం వీరు సంఘాన్ని ఏర్పాటు చేశారన్న కారణంతోనే ఈ చర్య తీసుకొన్నారు. యాజమాన్యం కార్మికశాఖ కమీషనర్ కార్యాలయానికి వెళ్ళలేదు.
మరుసటి రోజు సెప్టెంబర్ 21న ఉద్యోగులు లోపలికి వెళ్ళేందుకు వారి కార్డులు పంచ్ వేసుకుంటున్నారు. వారిలో ఇద్దరు - రాజా మణికందన్, సంఘ సహాయ కార్యదర్శి సి. ప్రకాష్ లోనికి ప్రవేశించకుండా వారి కార్డ్పంచ్ జరగకుండా నిలిపివేసినారు. వెంటనే ఈ వార్త దావానంలా వ్యాపించడంతో, ఉద్యోగులందరు భవనానికి బయటవైపు ధర్నాలో కూర్చున్నారు. ఈ ధర్నా సెప్టెంబర్ 26 వరకు కొనసాగింది. 200మీటర్ల లోపు ధర్నా చేయరాదన్న కోర్ట్ ఆజ్ఞతో, ధర్నాను ూ×ూజఉుకి మార్చి, ఒక టెంట్ నిలబెట్టడం జరిగింది. ఇది ఆత్మగౌరవానికి, సంఘాన్ని ఏర్పాటుచేసే హక్కు కొరకై చేస్తున్న ఒక ముఖ్యమైన పోరాటంలో ఉద్యోగులందరూ విజయం సాధించేదాకా 55 రోజుల పాటు కొనసాగింది.
'పీపుల్స్ డెమోక్రసీ' సౌజన్యంతో
యస్. కన్నన్
అనువాదం: బోడపట్ల రవీందర్.
సెల్: 9848412451