Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూటమిలోని ప్రధాన భాగస్వామి బీజేపీ గతం కన్నా స్థానాలను పెంచుకొని పార్లమెంటులో సంపూర్ణ ఆధిక్యత సాధించింది. ఎన్నికలలో కులం, మతం, ప్రాంతం పేర్లతో ప్రచారం, సమీకరణలు జరిగాయి. ఎన్నికల ఫలితాలతో సామాజిక న్యాయం కోసం జరుగుతున్న కృషికి కూడా ఎదురుదెబ్బ తగిలింది. వామపక్షాలు మినహా మిగతా పార్టీల ఎన్నికల ప్రణాళికలు ప్రజల సమస్యలను విస్మరించాయి. సంకుచిత ప్రయోజనాలకు పెద్దపీట వేయటంతో పాటు పెరుగుతున్న కుల, మత, ప్రాంతీయ తత్వాలను వినియోగించుకొనే ప్రయత్నం చేసింది. అధికారంలో ఉన్న బీజేపీ, డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసింది. వ్యక్తిగత విమర్శలు, దూషణలు ప్రచారంలో చోటు చేసుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ అయినప్పటికీ మిగతా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ భాగం అదే దారిలో సాగాయి. కాంగ్రెస్ ఎత్తుగడలు ప్రతిపక్షాల ఐక్యతకు దోహదం చేయలేదు. ఆ పార్టీ నిర్వహించిన ప్రచారం ప్రజలకు విశ్వాసం కలిగించలేదు. ప్రజలెదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం, రైతాంగ దుస్థితి, ఆత్మహత్యలు, వ్యవసాయ కార్మికులకు పని కల్పించటం, ఉపాధి హామీ పథకం తదితర సమస్యలకు మోడీ ఎటువంటి పరిష్కారాలనూ ప్రతిపాదించలేదు. అస్తిత్వవాద ఉద్యమాల ఫలితంగా గత మూడు దశాబ్దాలుగా పెరుగుతున్న మత, కుల, ప్రాంతీయ వైషమ్యాలను, అశాస్త్రీయ భావాలను, మూఢ విశ్వాసాలను వినియోగించుకొంటూ ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ఎన్నికల నిబంధనలను లక్ష్య పెట్టకుండా పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్పై జరిగిన సైనిక చర్యలను ప్రస్తావించటం, ఉగ్రవాద దాడులలో మరణించిన సైనికుల పేరుతో ఓట్లడగటం, మతపరమైన విజ్ఞప్తులు, పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు.
'ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా' అన్న చందంగా ప్రధానమంత్రి ఈ విధంగా ప్రచారం చేస్తుంటే ఆయన అనుచరులు మరింత దిగజారిన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యూహంలో జమ్మూ కాశ్మీర్ ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. కాశ్మీరీయులకు ప్రత్యేక హక్కులు ఇచ్చారని, అందువలనే అక్కడ వేర్పాటువాదం పెరిగిపోతున్నదని, వారికి ఇచ్చిన ప్రత్యేక హక్కులను రద్దు చేస్తేనే ఉగ్రవాదం తగ్గుతుందని, దేశ సమైక్యత బలపడుతుందని ప్రచారం చేశారు. కొందరు బీజేపీ నాయకులైతే తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్-370, 35ఎలను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కాబోతున్న సందర్భంలో ప్రకటించిన బీజేపీ ఎన్నికల ప్రణాళికలో కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించటంలో ప్రధానాంశాలుగా ఉన్న ఆ రెండు ఆర్టికల్స్ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. తన విధానాల ఫలితంగా కాశ్మీరులో కల్లోలం చెలరేగినా, దేశం విచ్ఛిన్నమైనా బీజేపీకి ఏ మాత్రం పట్టదు. కాశ్మీరీ ముస్లింలను బల ప్రయోగంతో అణచివేయటం, వారిలో అసంతృప్తిని పెంచటం, ఫలితంగా వచ్చే ఆందోళనలను ఆధారం చేసుకొని కాశ్మీరీ ముస్లింలతో పాటు మొత్తం ముస్లింలను ఉగ్రవాదులని ముద్ర వేయటం, ఉగ్రవాదులను అణచివేస్తున్నామనే పేరుతో సైనిక చర్యలను తీవ్రం చేసి, తాము మాత్రమే దేశ ఐక్యత కాపాడగలమని ప్రచారం చేసుకోవటం సంఫ్ు పరివార్ ఎత్తుగడ. వీటితో పాటు బలహీనపడుతున్న అగ్రవర్ణ ఆధిక్యతను తిరిగి పునరుద్ధరించాలన్నది కూడా ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగం. ముస్లింలపై నిరంతరం దాడులు, హత్యాకాండను కొనసాగించటం ద్వారా తాను చేస్తున్న దేశద్రోహాన్ని, తప్పులను, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి మాత్రమే దేశభక్తి అంశాన్ని ముందుకు తెస్తున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలు దేశ సమైక్యత, సమగ్రతలను ధ్వంసం చేసి, వేర్పాటువాదం పెరగటానికి బాటలు వేస్తాయి.
ఇన్ని విధాలుగా బీజేపీ ప్రచారం చేసుకున్నా, సంఫ్ు పరివార్ సర్వశక్తుల్ని కేంద్రీకరించినా అనేక రాష్ట్రాలలో బీజేపీకి పరాభవం తప్పలేదు. కేరళలో ఒక్క స్థానమూ దక్కలేదు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. పార్లమెంటు, శాసనసభలో ఆ పార్టీ ఒక్క స్థానం కూడా సాధించలేదు. తమిళ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఒడిషాలో బీజేపీ ఐదవసారి కూడా తన ఆధిక్యత కొనసాగిం చింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుచుకున్నది. పంజాబ్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది.
ఎన్నికల ప్రచారంలో బీజేపీ రెచ్చగొట్టిన భావోద్వేగాలు ఆ పార్టీ గెలుపు సాధించిన రాష్ట్రాలు, ఓటు వేసిన ప్రజలలో ఎక్కువ కాలం ఉండవు. అనతికాలంలోనే నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు వారిని చుట్టుముడతాయి. కార్పొరేట్లు, ఫ్యూడల్ శక్తులకు సేవ చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజల సమస్యలను పరిష్కరించగల శక్తి లేదు.
- ఎ. కోటిరెడ్డి