Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో, ఏపీలో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు ఇక ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి. నాయకులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలి. ప్రజలకు కావలసినవి ముఖ్యంగా ఉపాధి, తాగునీరు, ఆహారం, వస్త్రాలు, విద్యావకాశాలు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు ముందుగా పరిస్థితులను అవగాహన చేసుకొని, ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు నడుం కట్టాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ప్రజలు మౌలిక సౌకర్యాల గురించి అడుగుతూనే ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం అవినీతి లేని పారదర్శక పాలన, ప్రజలంతా భయంతో, అభద్రతతో బతుకుతున్నారు. గుండె మీద చెయ్యి వేసుకొని ప్రతిమనిషి నిశ్చింతగా ఉండే పరిస్థితి కల్పించాలి. నాయకులు నిజాయితీగా వ్యవహరిం చాలి. ప్రజాధనాన్ని ప్రజాభ్యుదయానికే వినియోగించాలి. అధికారుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆకస్మిక తనిఖీలు చేపడుతూ లోపాలను నివారించాలి. ప్రజలు ఓటు ద్వారా ఇచ్చిన అపూర్వ అవకాశాన్ని పాలక పక్షాలు సద్వినియోగం చేసుకోవాలి.
- గూరుడు అశోక్, జగిత్యాలజిల్లా.