Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనాభా అధికంగా లేని రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు లేని రోజుల్లో కొన్నేండ్ల క్రితం కూడలిలో ప్రధాన రహదారుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆనాటి పరిస్థితులకు అది సమంజసమే. కానీ, నేడు జనాభా విపరీతంగా పెరిగిపోవటంతో రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేపట్టడం వలన అప్పటి విగ్రహాల సమస్య తలెత్తుతోంది. రోడ్ల వెడల్పులో ప్రజా సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో ఉంచుకొని వాటిని తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ వారికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అన్ని పార్టీలవారు, దేవాలయాలు, చర్చిలవారు, యూనియన్లు సహకరించి విగ్రహాలు తొలగించడానికి సహకరించాలి. విగ్రహాలు రోడ్ల మధ్య కాకుండా అనువైనచోట ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీన్ని మతానికో, పార్టీలతో ముడిపెట్టి రాజకీయం చేయరాదు. ఇది అన్ని వర్గాల సమస్య. దీన్ని పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా సమస్య ఒక్కటే ఉంటుంది. దీనికిఎవరినీ తప్ప పట్టరాదు. అడ్డం కాకుండా అనువైన చోట ఏర్పాటు చేసుకోవటం మంచిది. అనేక పట్టణాలలో ఈ సమస్య నేడు తీవ్రరూపం దాల్చుతోంది. అన్ని వర్గాలను సమన్వయపరచి, సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది.
- అయినం రఘురామారావు, ఖమ్మం