Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ వర్షాకాలంలో వరుణుడు మన రాష్ట్రం మీద శీతకన్ను వేసినట్టే అనిపిస్తున్నది. వర్షాలు కురవక రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వర్షాలు కురవాలని ఎందరో ప్రకృతికి వివిధ రీతులలో మొరపెట్టు కుంటున్నారు. కొంతమంది కప్పతల్లి ఆటలాడి కప్ప ఉసురుపోసుకుంటున్నారు. కప్ప గోస చూడలేక వరుణుడు కరుణిస్తాడని ఒక నమ్మకం. అయితే స్వార్థం కోసం అడవులను నరుకుతున్న మనిషికి దాని ఫలితాల సంగతి ఇంతవరకు అవగతం కాలేదు. ఇష్టానుసారం చెట్లు నరుకుతూ ఉంటే వర్షాలు ఎలా కురుస్తాయి. వర్షాలు కురవడానికి చెట్లూ పచ్చదనం పరిరక్షణ శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే వర్షానికి చిరునామాగా చెప్పే చిరపుంజిలో కూడా వర్షాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మనిషి ముందున్న కర్తవ్యం ఒక్కటే. అడవులను పెంచడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం. ఇది చేస్తే కరుణించడానికి వరుణుడు నిస్సందేహంగా ముందుకు వస్తాడు. అప్పుడు అంతా పచ్చదనమే.
- గూడూరు అశోక్, జగిత్యాలజిల్లా.