Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనా కమ్యూనిస్టు పార్టీలో ఒక గొప్ప ఒరవడి కొనసాగుతున్నది. అందులో పార్టీ ప్రస్తుత నాయకులు గతంలో పార్టీకి వివిధ స్థాయిలలో నాయకత్వం వహించి పెద్ద వయస్సు రీత్యా విశ్రాంతి తీసుకొంటున్నవారు ప్రతీ సంవత్సరం వేసవి విడిదిగా జులై చివర నుంచి ఆగస్టు మొదటి భాగంలో సముద్రతీర పట్టణమైన బైదహీలో కలిసి దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలపై ఆహ్లాదకర వాతావరణంలో సమాలోచన చేస్తారు. ఈ ఒరవడి మావో కాలంలో మొదలై యిప్పటికీ కొనసాగుతున్నది. ఈ ఏడాది కూడా ఈ సమాలోచన జరిగింది. ఈ అంశంపై బీజింగ్లో ''ది హిందు'' దినపత్రిక ప్రతినిధి, అతుల్ అనేజ ఒక వ్యాసం రాశారు.
బీజింగ్ నుంచి తూర్పున 300 కిలోమీటర్లు దూరంలో బోహై సముద్రం తీరంలో బైదహీ అనేది ఒక చిన్న పట్టణం. అక్కడి బీచ్ చాలా సుందరమైనది. ఇసుకతో నిండిన బీచ్, పచ్చని ఆవరణం, స్వచ్ఛమైన గాలిలో అనేక విన్యాసాలు చేస్తుంటారు. వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. బైదహీలోని ఆహ్లాదకరమైన పరిసరాలు, ఉపశమనం కల్పించే వాతావరణం, బీజింగ్కి దగ్గరలో ఉండటంతో దానిపై జనచైనా రిపబ్లిక్, మొదటితరం నాయకుల దృష్టి పడింది. జనచైనా రిపబ్లిక్ వ్యవస్థాపకుడు మావోసేటుంగ్ అక్కడ ప్రతీ సంవత్సరం ఏకాంతవాసంలో సమాలోచనలు జరపాలని నిర్ణయించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ సమా లోచనలు జరపాలని అందులో పార్టీ సీనియర్లు విశ్రాంతిగా తక్షణం దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యల గురించి మేదోమధనం చేయాలని కోరుకున్నారు.
మావో ఇలాంటి సమావేశాలలోనే కొన్ని అతి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగమే ''గొప్ప ముందడుగు'' అనే విధానాన్ని ప్రారంభించడం, క్వీమోయి దీవుల వద్ద కొమింగ్టంగ్ సైనిక స్థావరం ఉండేది అది చైనా ప్రధాన భూభాగానికి దగ్గరలో ఉన్నందున 1958లో దానిపై దాడి చేయాలనే నిర్ణయం అక్కడే చేశారు.
బైదహీ పట్టణంలో ఒక భారీ గెస్ట్హౌస్, చైనాలో సాంప్రదాయకంగా ఉండే అనేక భవనాలను పోలీన భవనాలు అధిక సంఖ్యలో నిర్మించారు. వీటిని నిర్మించాలనే ఆలోచనకు ప్రధాన కారణం ఏమిటంటే 1950లో చైనాలో సోషలిస్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు దానిలో భాగస్వామ్యం వహించడానికి వచ్చిన సోవియట్ నిపుణులకు ఇక్కడే బస ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి అయ్యింది.
గత కొద్ది సంవత్సరాలుగా జులై చివర నుంచి ఆగస్ట్ మొదటి భాగంలో జరిగే రహస్య సమాలోచనలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. దానికి కారణం ఇందులో ప్రస్తుత నాయకులు వచ్చి వారి పూర్వ నాయకులతో సమాలోచనలు జరపడమే. ఆ పూర్వ నాయకులను వారు ప్రేమతో ''పెద్దలు'' అని పిలుచుకుంటారు. ఈ సమాలోచనలలో పెద్దలు స్వేచ్ఛగా నాయకులను విమర్శించ వచ్చు, సలహాలు కూడా ఇవ్వ వచ్చు. కానీ వాటిని పాటించాలనే కచ్చితమైన నిబంధనేమీలేదు. అయితే పెద్దలు చేసే సూచన లను మాత్రం ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.
ఈ పెద్దలు పదవులలో లేకపోయినా చైనా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులలో వారిపట్ల ఆదరణ కొనసాగుతున్నది. అందుకు ఈ పెద్దలకు భావజాలంపై ఉన్న పట్టు, ప్రాంతీయత, విధాన పరమైన అంశాలుపై ఉన్న పట్టు కారణమవు తున్నాయి. ఆల్ప్రేద్వూ, అసిస్టెంట్ ప్రొఫెసర్గా లీకూద్ ఈ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, నేషనల్ యూనివర్సిటీ సింగపూర్లో పని చేస్తున్నారు. ఆయన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రికకు చెప్పినట్టు ''బైదహీ'' అనే చోట సీనియర్లు ప్రస్తుత లీడర్లు కలిసి సమావేశాలు జరుపుకుని విధాన పరమైన అంశాలపై ఇష్టా గోష్టిగా లేక అనధికారికంగా చర్చించుకుంటారు. వాటిలో వచ్చే అభిప్రాయాలకు దేశ విధాన నిర్ణయాలపై గణనీయమైన ప్రభావం ఉంటున్నది.''
''బైదహీ''లో సమావేశాలు జరుపుతున్నట్టు బహిరంగ ప్రకటనలు ఉండవు. కానీ వేసవి సమావేశాలు ప్రారంభమైనట్టు కొన్ని సంకేతాలు కనపడుతుంటాయి. గ్జిన్హువా వార్తా సంస్థ ద్వారా ఆగస్ట్ మొదట్లో వచ్చిన వార్తల ప్రకారం ఇద్దరు సీనియర్ నాయకులు నగరానికి చేరుకున్నారని వారు 58మంది నిపుణులతో సమాలోచనలు జరుపు తారని తెలియవచ్చింది. దేశం యొక్క మేధోమదన కేంద్రం అవతరించింది. ఆ ఇద్దరులో ఒక్కరు చెనజీ ఆయన పార్టీ నిర్మాణ విభాగానికి అధిపతి, రెండోవారు మహిళ ఆమెపేరు ''సన్'' చైనాదేశ ఉపాధ్యక్షురాలు. ఆవిడ ఒకప్పుడు గడియారాల కంపెనీలో సాధారణ కార్మికురాలిగా పనిచేసేది. తను ఆన్షన్ ఇండిస్టియల్ టెక్నాలజీ అకాడమీలో చదువుకున్నారు. ఈ అకాడమీ చైనా ఈశాన్య ప్రాంతంలోని లీయోనింగ్ ప్రావిన్స్లో ఉంటుంది. ఒక సాధారణ కార్మికురాలు ఉన్నతస్థాయికి అసాధారణంగా ఎదగడమనేది ఇక్కడ మనం గుర్తించాలి. ఈ ఇద్దరు సీనియర్ నాయకులు మేధావులతో సంప్రదింపులు జరపడంతో ఈ సంవత్సరం బైదహీ సమాలోచనలు ప్రారంభానికి సూచికగా కనపడుతున్నాయి.
సమావేశాల ఎజెండా - సమావేశాల ఎజెండా కచ్చితంగా ఇదీ అని చెప్పడం చాలా కష్టం. అయితే ఈ సమావేశాల అంశాన్ని పరిశీలిస్తున్న చైనా మీడియా మాత్రం ఈసారి ఏడుగురు పోలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈ నగరానికి సాగిస్తున్న రాకపోకలను నిశితంగా గమనిస్తున్నారు. దీన్నిబట్టి చైనా అత్యున్నత నాయకత్వం ఈ సమాలోచనలకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతున్నది.
డ్యూవీ అనే పత్రిక.. ఇది ప్రవాస చైనీయులలో బాగా ప్రభావం కలిగినది. అందులో వస్తున్న వార్తల ప్రకారం బైదహీ సమాలోచనలు ప్రస్తుతం బాగా హాట్ టాపిక్గా ఉన్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, హాంకాంగ్ పరిణామాలు, తైవాన్లో నెలకొన్న పరిస్థితుల గురించి దిశా నిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నారు. జింగ్ జియాంగ్ ప్రాంతంలో చైనా పునః విద్యా శిబిరాల (విద్యగురించి పునశ్చరణ) వద్ద మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం గురించి కూడా బైదహీ సమాలోచనలో ప్రస్తావన వస్తుందని భావిస్తున్నారు.
చైనా సెంట్రల్ టెలివిజన్ (సిసిటివి) జులైలో జింగ్ జియాంగ్ జిల్లా హెటిన్ గ్రామంలో జరిగిన మూడు రోజుల మహాసభలకు వ్యాంగ్ యాంగ్ హాజరయినట్టు ప్రచారం చేసింది. వ్యాంగ్ యాంగ్ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీలో నాలుగవ ర్యాంక్లో ఉన్నారు. ఆయనను టీవీ కేంద్ర కమిటీలో జింగ్ జియాంగ్లో జరుగుతున్న పనిని సమన్వయ పరిచే బృందానికి అధిపతి అని పరిచయం చేసింది. వ్యాంగ్కు ఇబ్బందులకు పరిష్కారాలు చూపగల సామర్ధ్యం గల వారిగా పేరు ఉన్నది. ఆయన చింగ్ హురు ప్రాంతం అది టిబెట్లోని ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళి రాజకీయంగా సున్నితమైన పేదరిక నిర్మూలనా పథకాల అమలు గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి వచ్చారు.
మరో పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు హాన్జెంగ్ హైటెక్ సిటీ ఉన్న శాన్జిన్ నగరాల్ని బైదహీ సమాలోచనలకు ముందే పర్యటించారు. శాన్జన నగరం హంగ్ కుంగ్కి పక్కనే ఉంటుంది. హన్జెంగ్ని శానజన్ నుంచే హంగ్ కాంగ్ అగ్రనాయకులతో మాట్లాడటానికి అధికారాలు కల్పించారు.
- అతుల్ అనేజా
రచయిత : ''ది హిందు'' పత్రిక బీజింగ్ ప్రతినిధి
అనువాదం : టి.ఎన్.వి.రమణ,
8985628662