Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం చేసే కొన్ని సర్కస్ ఫీట్లు బహు చిత్రంగా ఉంటాయి. కేంద్రంలోని మోడీ సర్కారును దుమ్ము దులిపినట్టే ఉంటుంది.. కానీ అంతలోనే దులుపుకొని పోయినట్టూ ఉంటుంది. ప్రజలకి మాత్రం సీఎం కేసీఆర్ సాబ్ కేంద్రంలోని మోడీ సాబ్కు మిత్రుడో, శత్రువో అర్థం అయ్యి.. అవనట్టే ఉంటుంది. మొన్నామధ్య సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నామని సీఎం కేసీఆర్ సాబ్ ప్రకటించారు. దీనితో ప్రధాని మోడీపై ఆయన నిప్పులు చెరుగుతున్నారని జనం అనుకొనేలోపు.. కరోనా వచ్చి పడింది. పారాసిట్మాల్ చాలంటూ అసెంబ్లీలో చెప్పిన సీఎంకు ఆ తర్వాత ఎవరో గీతోపదేశం చేశారు. దానితో 'కరోనా పీడ' అంటూ లాక్డౌన్ పెట్టారు. కేంద్రంలో మోడీసాబ్ కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అన్నారు. రాష్ట్రానికి ఏవో పైసలు వస్తాయనుకుంటే రాకపాయే! దీనితో కేంద్రంపై మళ్లీ కారాలు మిరియాలు నూరబడ్తిరి. అంతలోనే కరోనాను ఎదుర్కొవడానికి కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామంటూ సీఎం చెప్పబడ్తిరి. పబ్లిక్... దొందూ దొందే అనుకొనే టైంకి కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణల బిల్లు-2020ను వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ సాబ్ ప్రకటించారు. మోడీ సాబ్కు మళ్లీ ఎదురు తిరుగుతున్నారనుకొనే లోపు హెలికాప్టర్ మనీ, రాకెట్ మనీ అంటూ మళ్లీ ఏవేవో మాట్లాడబడితిరి. అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్, కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ సుట్టుపక్కల రాష్ట్రాల సీఎంలను కలిసి మంతనాలు సాగిస్తిరి. అది అక్కడికే ఆగిపాయే! ఇంతకీ కేసీఆర్ సాబ్, మోడీ సాబ్కు దోస్తా.. దుష్మనా?
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి