Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1975 జూన్ 25వ తేదీ అర్థరాత్రి పోలీసుల బూటు కాళ్ళ చప్పుళ్ళతో ఢిల్లీ నగరం ఉలిక్కిపడ్డది. నగరం అంతా ఖాకీమయం అయింది. పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి వ్యాన్లు అన్ని వైపులా దూసుకెళ్ళాయి. మీడియా సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దినపత్రికలను సరఫరా చేసే వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు ప్రభుత్వ ఆదేశంతో జర్నలిస్టులను అదుపులోకితీసుకున్నారు. ప్రతిపక్ష నేతలను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియని పరిస్థితి. వారెంట్ కూడా లేకుండా అరెస్టులు మొదలైనవి. చివరికి అరెస్టు చేసి జైలులో పడేశారు. మిగతా చిన్న చిన్న నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అడిగినా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఆ తర్వాత అర్థం అయింది భారతదేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తుందన్న విషయం.
రాష్ట్రపతి సంతకం తర్వాత కూడా ఇందిర ప్రజలకు ఈ ఎమర్జెన్సీ సందేశం ఎలా తెలుపాలన్న సంక్షోభంలో పడ్డది. రాత్రి నుంచి పగలు కాబోతుంది. అయినప్పటికీ అప్పటి బెంగాల్ సీఎం ఇందిరాగాంధీ మిత్రుడు అయిన సిద్ధార్థ శంకర్తో ఈ విషయం చర్చించి సలహా అడగటం మొదలు పెట్టింది. మధ్య రాత్రి 3.00గంటల వరకు ఎమర్జెన్సీ విధించి ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి అన్నదానిపై తర్జన భర్జన చేస్తున్నారు. దేశంలో అప్పటికే ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించారు. ఃAససతీవరర ్శీ చీa్ఱశీఅః అనే సందేశాన్ని తయారు చేశాక ఇందిరాగాంధీ భేటీ అయిపోయింది.
26, జూన్ 1975 రోజున ఇందిరాగాంధీ ఉదయం 8.00 గంటలకు రేడియో ద్వారా ప్రజలకు ఎమర్జెన్సీ సందేశాన్ని అందించారు. ఆ సందేశాన్ని ఆమె ఇంగ్లీష్, హిందీ భాషలలో వివరించారు. ఆమె సందేశం ఇలా ఉంది. రాష్ట్రపతి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఎవరూ ఈ అత్యవసర పరిస్ధితులకు భయభ్రాంతులకు గురికావద్దు అంటూ ఆమె సందేశం ఇచ్చారు. అయితే ఇందిరాగాంధీ ఆర్టికల్ 353కి అనుగుణంగా ఎమర్జెన్సీని విధించారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఎప్పటి వరకు అంటే అప్పటివరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంది. అసలు ఇందిరాగాంధీ భారతదేశాన్ని ఎమర్జెన్సీ వైపు తీసుకువెళ్ళిన ముఖ్య కారణాలు ఏమిటంటే..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రారుబరేలీ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ ఎన్నికలలో గెలుపొందింది. కానీ ఆమె ప్రత్యర్థి అయిన రాజ్ నారాయణ్ మాత్రం ఓటమిని అంగీకరించలేదు. అప్పుడు ఇందిరకు ఒక లక్షా 83 వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. సోషలిస్టు పార్టీ అభ్యర్థి అయిన రాజ్ నారాయణ్కు 71,499 ఓట్లు వచ్చాయి. రాజ్ నారాయణ్ మాత్రం ఎన్నికల ఫలితాలపైన హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఏమని అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ఈ ఎన్నిక గెలిచారు అని. అలహాబాద్ న్యాయస్థాన న్యాయమూర్తి అయిన జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా ఈ కేసు మీద విచారణ ప్రారంభించారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశ ప్రధాని కోర్టు మెట్లుఎక్కారు. ఈ కేసుపై ఇందిరాగాంధీని 5గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. జూన్ 13, 1975 జస్టిస్ సిన్హా విచారణ ముగిసింది. ఇందిరాగాంధీ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలంటూ తీర్పు వెలువడింది. దీంతో పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పీఠం వదలడానికి చొరవ చూపలేదు. మళ్ళీ సుప్రీంకోర్టులో దానిపై వాదనలు నడిచాయి. 24 జూన్, 1975న సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. ఇందిరాగాంధీ ప్రధాని పీఠంలో ఉన్నా కూడా ఆమెకు పూర్తి అధికారాలు మాత్రం చెల్లుబాటు కావు అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో ఆమె ఎమర్జెన్సీ దిశగా అడుగులు వేశారు. మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఎమర్జెన్సీ విధించే పత్రాలు అప్పటి రాష్ట్రపతి అయిన ''ఫక్రుద్దీన్ అలీ అహ్మద్'' వద్దకు చేరాయి. ఆయన మరీ అంత ఆలోచించకుండా ఆ పత్రాలపై సంతకం చేశారు. రాష్ట్రపతి సంతకంతో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించడానికి అన్ని తలుపులూ తెరుచుకున్నాయి. దీంతో భారతదేశ ప్రజాస్వామ్య విలువలను చీకటిలోకి నెట్టడం జరిగింది.. నాలుగున్నర దశాబ్దాల తరువాత నేడు ఎమర్జెన్సీని మించిన చీకటిరోజులు కనిపిస్తుండటం ఆందోళనకరం!
అక్షరు కుమార్
సెల్:9030439693