Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచం 'గ్లోబల్ విజేతగా' మారింది. ఏ దేశానికి ఆదేశం ఆర్థికాభివృద్దిని కోరుకోవడం సహజం. భారతదేశం ప్రస్థుతం ఉన్న 2.5ట్రిలియన్ల జీడీపీని 5ట్రిలియన్లకు పెంచాలని ఆశాభావంతో ఆర్థిక పెరుగుదలకు అడుగులు వేస్తున్నది. ప్రపంచంలో తన మొదటి స్థానం నిలుపుకోవడానికి అమెరికా మూడో ప్రపంచదేశాల ఆర్థిక విధానాలను శాసిస్తున్నది. అలాగే కమ్యూనిస్టు దేశాలు తమ ఆర్థికాభివృద్దికి పోరాడుతున్నాయి. ప్రస్థుత కాలంలో యుద్ధం వస్తే అంత వినాశనమే. అందుకే అన్ని దేశాలూ సంయమనం పాటించి చర్చల ద్వారా పరిష్కరాలు చేసుకుంటున్నాయి. నిజమైన దేశభక్తులు కోరుకునేది అదే. కానీ కుహనా దేశభక్తులు 'శవాలపై పేలాలు ఏరుకునే చందంగా'' తమ భక్తి విశ్వాసాలు చాటుకుంటున్నారు. ఏ దేశమూ మరోక దేశంతో వ్యాపారాలు జరపకుండా అభివృద్ధికాదు. పైగా తమ ప్రజల ఆహార, ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించలేవు. తమ వ్యాపార లోటును తగ్గించుకొని స్వయం సమృద్ధి కావడమేకాక, ఎగుమతులు పెంచాలన్న తాపత్రయంలో ఉంటున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, సాంస్కృతిక, క్రీడల విభాగాలలో ప్రపంచం కలిసిపనిచేయక తప్పని పరిస్థితి ఎర్పడింది. నేటి యుగంలో విడివిడిగా ఏ దేశం మనలేదన్న వాస్తవాన్ని గుర్తించాలి. తగాదాలు సృష్టించడం తెలికే అయినప్పటికీ పరిష్కరించడం నష్టాలతో కూడిన పని.
భారతదేశానికి మయన్మార్, బంగ్లాదేశ్, బూటాన్, టిబెట్, చైనా, పాకిస్థాన్, నేపాల్ దేశాలతో సరిహద్దు సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఒక్కో దశలో ఘర్షణ వాతవరణంలోకి వెళుతున్నాయి. అ సందర్భంగా సంబంధిత దేశాలు చర్చల ద్వారా పరిష్కరం చేసుకోవాల్సిందే తప్ప యుద్దం సమస్యకు పరిష్కారం చూపదు. భారతదేశానికి ఈస్టీండియా కంపెనీ, బ్రిటిష్ పరిపాలనా కాలంలో సరిహద్దు సమస్యలను పరిష్కరించకుండా అనామతు సరిహద్దులను నిర్ణయించింది. సర్ హెన్రీ మెక్మోహన్ నాటి బ్రిటిష్ అధికార ప్రతినిధి సిమ్లాలో జరిపిన సమావేశం (ఆక్టోబర్ 1913 - జూలై 1914)లో టిబెట్, చైనా, నేపాల్, భారత్దేశాలతో సంప్రదించి ఒక రేఖను నిర్ణయించారు. ఈ సమావేశం నుంచి చైనా సంతకం చేయకుండా వెళ్ళిపోయింది. టిబెట్ తన భూభాగంలోనిదని, దానికి దేశ ప్రతిపత్తి ఇవ్వరాదని ఒప్పందాన్ని అంగీకరించలేదు. అయినప్పటికీ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా సరిహద్దులు కొంత మేరకు నిర్ణయించబడ్డాయి. ప్రస్తుతం చైనాతో గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం ప్రారంభమైంది. ఆలాగే నేపాల్తో కాలాపాని (400 చ.కి.మి) ప్రాంతంలో వివాదాలు మొదలైనాయి. ఇవన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోవడం జరగాలి. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో సంబంధిత దేశాలు రోడ్లు వేస్తున్న సందర్భంగా ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చైనా-భారత్ మధ్య వివాదం సద్దుమణిగింది. సరిహద్దుల నుంచి 2కి.లో.మీటర్ల వరకు వెనక్కుతగ్గడం జరిగింది. నెపాల్ సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఈస్టీండియా కంపెనీ (1757 - 1857), బ్రిటిష్ ప్రభుత్వం (1858- 1947) సరిహద్దుల సమస్యపై స్పష్టమైన పరిష్కారం ఇవ్వకుండా 'విభజించు పాలించు' అన్న విధానాన్ని అమలు జరపడానికి పెండింగ్లో పెట్టారు. ఆ వివాదాలు నేడు యుద్ధాలకు దారితీసే పరిస్థితి ఎర్పడింది. కొందరు దేశభక్తుల పేరుతో యుద్ధాలు కొనసాగించడానికి కవ్వింపు చర్యలు, సమస్యను పెంచే వివాదాలను ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తమ రాజకీయ స్వలాభం కోసం దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడానికి కూడా వెనుకాడటంలేదు.
నేడు కోవిడ్ -19 మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. ప్రపంచంలో 1.21కోట్ల కేసులు కాగా, 5.50 లక్షల మంది మరణించారు. భారతదేశంలో 7.70లక్షలకు కరోనా కేసులు వెలువడగా, 21వేల మంది మరణించారు. ఈ సందర్భంలో కోట్లాది ప్రజలు నిత్యావసరాలకు అంగలారుస్తున్నారు. ఒకవైపున నిరుద్యోగం పెరుగుతుండగా మరోవైపు 50శాతం ఉన్న ఉద్యోగాలు పోయాయి. పారిశ్రమిక సేవా రంగాల ఉత్పత్తి భాగాపడిపోయింది. భారత వృద్దిరేటు 7.5శాతం నుంచి మైనస్ 4.1శాతానికి తగ్గింది. విదేశీరుణాలు 40లక్షల కోట్లకు చేరాయి. ఇలాంటి స్థితిలో దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, మౌలిక వసతులను వినియోగించడానికి దేశ వ్యాపితంగా కృషి సాగాలి. దిగజారిపోతున్న ఆర్థిక విధానంపై భారం పడకుండా చూడాలి. బడ్జెట్లో కేటాయించిన రక్షణశాఖ నిధుల నుంచి యుద్ధ విమానాలు కోనుగోలు చేయడాన్ని కోంతమంది సరిహద్దుయుద్దానికి సన్నదం అవుతునట్టు ప్రచారం చేశారు. అతిక్రమణలు ఎవరు ప్రారంభించినా ఖండించాల్సిందే. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారానికి ఉన్న అవకాశాలను దెబ్బతీయరాదు. భారతదేశాన్ని యుద్ధంలోకి నెట్టడానికి కొన్ని దేశాలు మీలటరీ సహయం చేస్తామంటూ ముందుకు వచ్చాయి. వాస్తవానికి సమస్యను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ద్వారా అన్ని దేశాలు ప్రయత్నించాలి. ముడో ప్రపంచ దేశాల అభివృద్ధిని చూడలేని సామ్రాజ్యావాద దేశాలు సరిహద్దు తగాదాలను యుద్ధాలుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అభివృద్ధి చేందుతున్న దేశాలు యుద్ధంలోకి వెళ్ళకుండ చర్చల ద్వారా పరిష్కరాలకు ముందుకు వెళ్ళడం విజ్ఞత అనిపించుకుంటుంది.
ఈ ఉద్రిక్తలను అవకాశంగా తీసుకొని కుహనా దేశ భక్తులు అనేక వాదనలు ముందుకు తెస్తున్నారు. ఆ దేశాల దిగుమతులపై నిషేదం విధించాలని, యుద్ధాలు కొనసాగించాలని ప్రకటనలు చేస్తున్నారు. వీరు వాస్తవాలను గమనించడం లేదు. ప్రపంచం ఎటు వెళుతున్నది అన్నది వీరికి పట్టదు. 'బావిలో కప్ప'లాగా ఆలోచనలు చేస్తుంటారు. అణ్వాయుధ పోటీ నివారణకు మొదటి అగ్రదేశం అమెరికా-అత్యంత చిన్న దేశమైన ఉత్తర కోరియాతో సంప్రదింపులు జరిపింది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. యుద్ధాల వలన జరిగే నష్టం ఎలాంటిదో తెలియజేసే నేటి సమకాలిన ప్రపంచంలో ఇరాక్, అప్ఘనిస్థాన్, సిరియా, పాలస్తీనా- ఇజ్రాయిల్ దేశాల అనుభవాలు మన ముందున్నాయి.
భారతదేశం ప్రపంచ జనాభాలో 2వ అతి పెద్దదేశం. 130కోట్ల జనాభాను పోషించాల్సివుంది. అభివృద్ధి కావడానికి చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్ కలిసి 'బ్రిక్స్' కమిటీ వేసి, ప్రపంచ బ్యాంకుకు దీటుగా బ్యాంకును ఏర్పరిచి పేదదేశాలకు ఎగుమతి రుణాలు ఇస్తున్నవి. అలాగే అనేక దేశాలు కూటములుగా ఏర్పడి తమతమ అభివృద్ధిని కొనసాగించుకుంటున్నాయి. ప్రస్తుతం భారతదేశం ఎగుమతి - దిగుమతి వ్యాపారంలో 13లక్షల కోట్ల లోటుతో కొనసాగుతున్నది. 2017-18లో రూ.10,44,519 కోట్లు లోటు కాగా ప్రస్తుత సంవత్సరం 2019-20లో ఏఫ్రిల్-డిసెంబర్ వరకు రూ.8,30,220 కోట్లకు చేరింది. అనాగా ఎగుమతులు 1శాతంకాగా, దిగుమతులు 8.1శాతానికి చేరాయి. ఈ లోటును అధిగమించాలి. అమెరికాతో జరుగుతున్న వ్యాపారంలో రూ.1.20 లక్షల కోట్ల మిగులుతో ఉంది. మన ఉత్పత్తి సరుకులు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆ దేశాలతో సంబంధాలు కలిగి ఉంటున్నాము. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోని 150 దేశాలతో ప్రత్యక్షంగా ఎగుమతి - దిగుమతుల వ్యాపారం కొనసాగిస్తున్నది. పప్పు దాన్యాలను ఆఫ్రికాలోని ముజాంబిక్ నుంచి ఏటా 5లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. మయన్మార్ నుంచి పప్పుదాన్యాలు, సింగపూర్, మలేషియా నుంచి వంట నూనెలు దిగుమతి అవుతున్నాయి. టెక్నాలజి, నూతన పరిశోధనలు ధనిక దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సోదర దేశాలతో ఘర్షణ ఎర్పడితే వాటిని బలపరిచే దేశాలు కూడా శత్రుకూటమిలోకి చేరిపోతాయి. ఆ విధంగా మన అభివృద్ధికి అటంకం ఏర్పడుతుంది. అందువల్ల ఏ సమస్యకైనా పరిష్కారం అంతిమంగా చర్చలేనన్నది అనుభవం నేర్పుతున్న పాఠం. సారంపల్లి మల్లారెడ్డి
సెల్:9490098666