Tue 16 May 20:29:25.158697 2023
Mon January 19, 2015 06:51:29 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఇందుకోసం ఖర్గే నివాసానికి సిద్ధూ వచ్చారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్... ఖర్గేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. డీకే వెళ్లిన కాసేపటికి సిద్ధరామయ్య వచ్చారు. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి ఎంపికపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది.