Wed 17 May 08:13:19.473059 2023
Mon January 19, 2015 06:51:29 pm
నవతెలంగాణ - పల్నాడు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్లగొండ జిల్లాకు చెందిన వారే. గుజరాల మండలం పులిపాడుకు వెళ్తుండగా వీరి ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.