Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
తల్లితండ్రులు పిల్లలకు రోడ్డు భద్రత విద్యాపై అవగాహన కల్పించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో రోడ్డు ప్రయాణం అనేది తప్పని సరిగా చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. కాబట్టి రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్గి ఉండాలన్నారు. మైనర్ పిల్లలకు తల్లితండ్రులు ఎట్టి పరిస్థితిల్లో వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. మైనర్ పిల్లలు వాహనాలతో పట్టుబడితే తల్లితండ్రులపైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు.