Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని బస్తీలలో ఎక్కడా డ్రయినేజీ సమస్యలు తలెత్తకుండా చూడాలని డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. గురువారం కాటేదాన్లో కార్పొరేటర్ తన కార్యాల యంలో జలమండలి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీల్లో డ్రయినేజీ సమస్యలను ఏర్పడినప్పుడు పరిష్కరిం చాలని ఆయన అన్నారు. నూతనంగా వెలసిన కాలనీలో డ్రయినేజీ పైప్లైన్ కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలోని దుర్గానగర్ లో గత వారం రోజులుగా కలుషిత జలాలు సరఫరా అవు తున్నాయి వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మైంటైన్స్ పనులలో జరుగుతు న్న జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారు లు నిత్యం బస్తీల్లో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిఎం చంద్రశేఖర్ గౌడ్, డీజీఎం సత్తార్,వినాయక్, ఖాదిర్ పాల్గొన్నారు.