Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జి.కురుమయ్య
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండల కేంద్రములో శని వారం నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు. తలకొండపల్లి సమీపంలోని దేవకీ గార్డెన్ లో రెండు రోజుల పాటు నిర్వహించే మహా సభలలో రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొని పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను సభా దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి దిశానిర్దేశంతోపాటు యూనియన్ ఆధ్వ ర్యంలో చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటించే ఈ సమావేశంలో జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల కార్మి కులు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.