Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కొడంగల్ రూరల్
సాక్షరభారత్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనాలు అందించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు బుస్సు చంద్రయ్య అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు సాక్షర భారత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్ధ్దతుగా సీపీఐ(ఎం), సీఐటీయూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా నాయకుడు బుస్స చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పట్లోళ్ల దామోదర్రెడ్డిలు మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను లేకుండా చేస్తానని హామీలు ఇచ్చి, ప్రస్తుతం వారి ఉద్యోగ నియామకాలు చేపట్టడంలేదన్నారు. గతంలో ఉన్న వారిని పర్మినెంట్ చేయాలని, కొత్తగా రెగ్యూలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ పతనం ఖాయమన్నారు. అనంతరం సాక్షర భారత్ ఉద్యోగులు నోటికి నల్లగుడ్డలను కట్టుకుని మౌన దీక్షతో తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో తహసీల్దార్కు వినతి పత్రాన్నిచ్చారు. కార్యక్రమంలో గ్రామ కో ఆర్డినేటర్లు వెంకటయ్య, పకీరప్ప, చిన్నయ్య, శేఖర్, బీమప్ప, ఫరీధాబేగం, జయశంత, గౌరమ్మ, సావిత్రి, బాలప్ప తదితరులు పాల్గొన్నారు