Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
- మున్సిపల్ కమిషనర్ సంతోష్కుమార్
నవతెలంగాణ-తాండూరు
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని తాండూరు మున్సిపల్ సంతోష్కుమార్ అన్నారు. బుధవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.... ప్రస్తుతం వర్షకాలం అయినందున సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. అందుకోసం ముందస్తుగా రోగాల భారీన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపల్ కేటాయించిన స్థలాల్లో మాత్రమే చెత్త పారేయాలన్నారు. వారానికి ఒకసారైన నీరు నిలువలను పారబోసి పాత్రలను శుభ్రం చేసుకోవాలన్నారు. చుట్టు పక్కల ఉన్న మురికి కుంటలు, కాలువలలో ఆయిల్ బాటిల్స్, కిరోసిన్, వ్యర్థ పదార్థాలను వేయరాదన్నారు. ఇంటి బయట చెత్త వేయకుండా చూసుకోవాలన్నారు. పట్టణ ప్రజలు దోమ తేరలను తప్పక వాడాలన్నారు. ప్రతీ ఒక్కరూ మరుగు దొడ్లను తప్పని సరిగా వినియోగించాలన్నారు. బహిరంగ మూత్ర విసర్జన నిషేదించా లన్నారు. భోజ నానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కో వాలన్నారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచి మున్సిపల్ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహాకరించాలన్నారు.