Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మారుతీ స్కూల్ నందు నిర్వహిం చిన నేషనల్ గేమ్స్ స్కూల్ సెలక్షన్లో మోహిన్ కాన్వెంట్ విద్యార్థి ఎం.డి ఆరీఫ్ తాండూరు మండల స్థాయిలో విజేతగా నిలిచి జిల్లా స్థాయికి ఎంపిక అయ్యారు. ఈ విషయం పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు ఎం.డి ఇస్మాయిల్ మాట్లాడుతూ... మోహిన్ కాన్వె ంట్ స్కూల్ నుంచి మా విద్యార్థి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపిక కావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మారు మూల పాఠశాల అయిన మోహిన్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు ఎంతో ప్రతిభ ఉన్న సాధన లేక ప్రతిభను చూపించలేక పోతున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులు అంటే చదు వుకు అంకితం కాకుండా కొంత సమయం ఆటలకు కూడా కేటాయి స్తే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నా రు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని బహుమానం ప్రధానం చేశాడు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.