Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛంద సంస్థకు అప్పగించొద్దు
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతి
నవతెలంగాణ - కొందుర్గు
మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్చంధ సంస్థకు, ఏజెన్సీలకు అప్పగించొద్దంటూ ఎంఈఓకు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ఏజెన్సీలకు అప్పగించే పద్ధతిని మానుకోవాలన్నారు. ఎంతో మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ఇప్పుడు వారి పొట్టకొట్టొద్దని కోరారు. పత్రికల్లో, మీడియాల్లో వస్తున్న వార్తలను చూసి కార్మికులు భయాందోళనలో ఉన్నారన్నారు. స్వచ్చంధ సంస్థల్లో నాణ్యమైన భోజనం అందదని, ఇప్పటికే పలు పాఠశాలల్లో బొద్దింకలు వస్తున్నాయన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకు ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష్యకార్యదర్శులు, నాయకులు సుభాష్, చోటేమియా, రాణెమ్మ, లింగం, నర్సింహారెడ్డి, లక్ష్మమ్మ, భారతమ్మ, శివకళ తదితరులు పాల్గొన్నారు.