Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ కడ్తాల్ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బుధవారం కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయిళ్ల శ్రీనివాస్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడ్తాల్ మండల కేంద్రంలో ఉన్న వినాయక మండపాల వద్ద వివిధ పార్టీల నాయకులు ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమనగల్ పట్టణంలో సాయినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మైసిగండిలో జరిగిన కార్యక్రమంలో నాయకులు మోత్యానాయక్, భాస్కర్నాయక్, జవాహర్లాల్ నాయక్, అమృనాయక్, హీరానాయక్, అమర్సింగ్ పాల్గొన్నారు.